AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ రాజీనామా.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇలాంటి సున్నితమైన సమయంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారి పేరుతో ఫేక్ న్యూస్ సృష్టించడంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మవద్దని, అధికారిక ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ రాజీనామా.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Nov 24, 2025 | 7:01 PM

Share

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరుతో సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించారు. గంభీర్ పేరు, ఫోటోతో ఒక నకిలీ (Fake Account) ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సృష్టించి, అందులో ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పోస్ట్ చేయడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.

అసలేం జరిగింది?

ఇటీవల భారత జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల సమయంలో మిశ్రమ ఫలితాలు వస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో గంభీర్ పేరుతో ఉన్న ఒక ఖాతా నుంచి ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. “భారత జట్టు కోచ్ బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు” అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది.

అచ్చం గంభీర్ అధికారిక ఖాతాను పోలిన విధంగా ప్రొఫైల్ పిక్చర్, బయో ఉండటంతో చాలా మంది నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఇది నిజమే అని పొరపడ్డారు. దీంతో క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. జట్టు వరుస వైఫల్యాల కారణంగా గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేయగా, మరికొందరు ఇది ఫేక్ న్యూస్ అని అనుమానం వ్యక్తం చేశారు.

Ind Vs Sagautam Gambhir Resign

ఆ పోస్ట్ చేసిన ఖాతాను నిశితంగా పరిశీలించగా, అది గంభీర్ అధికారిక ఖాతా కాదని తేలింది. గంభీర్ అధికారిక ఖాతాకు ఉండే ‘వెరిఫైడ్ టిక్’ లేకపోవడం, యూజర్ నేమ్‌లో చిన్నపాటి మార్పులు ఉండటాన్ని గమనించిన నెటిజన్లు.. ఇది సైబర్ కేటుగాళ్ల పనే అని నిర్ధారించారు. ఎవరో ఆకతాయిలు కావాలనే గందరగోళం సృష్టించడానికి ఈ పని చేశారని స్పష్టమైంది.

ఇలాంటి సున్నితమైన సమయంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారి పేరుతో ఫేక్ న్యూస్ సృష్టించడంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మవద్దని, అధికారిక ఖాతాల నుండి వచ్చే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంభీర్ తన కోచ్ బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు.