AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMAT: పాండ్యా సోదరులకు ఊహించని షాకిచ్చిన ధోని కొత్త బౌలర్.. హ్యాట్రిక్‌తో సంచలనం..

కర్ణాటక వర్సెస్ బరోడా మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో ఈ అద్భుతం కనిపించింది. ఇక్కడ అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బరోడా కెప్టెన్ కృనాల్‌తో సహా 3 వరుస బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడం ద్వారా తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

SMAT: పాండ్యా సోదరులకు ఊహించని షాకిచ్చిన ధోని కొత్త బౌలర్.. హ్యాట్రిక్‌తో సంచలనం..
Shreyas Gopal
Venkata Chari
|

Updated on: Dec 03, 2024 | 7:14 PM

Share

క్రికెట్ మైదానంలో అదృష్టం మారడానికి ఎంతో కాలం పట్టదు. ఏ ఆటగాడు ఎప్పుడైనా హీరో అవ్వొచ్చు లేదా అకస్మాత్తుగా జీరోగా మారవచ్చు. అదేవిధంగా, అనుభవజ్ఞుడైన భారత బౌలర్ అదృష్టం మారిపోయింది. ఇటీవలి కాలంలో అందరూ వీరిని మరచిపోవడం ప్రారంభించారు. కానీ, అతను ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన వెంటనే అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి అద్భుతాలు చేసిన శ్రేయాస్ గోపాల్ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. హ్యాట్రిక్‌తో సంచలంగా మారాడు. ఈ అద్భుతమైన ఫీట్ సమయంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి దిగ్గజాలకు బిగ్ షాక్ ఇవ్వడం గమనార్హం.

డిసెంబర్ 3వ తేదీ మంగళవారం ఇండోర్‌లో బరోడా, కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అందుకు ఆరో నంబర్ బ్యాట్స్ మెన్ అభినవ్ మనోహర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మనోహర్ కేవలం 34 బంతుల్లో 6 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగానే కర్ణాటక ఈ స్కోరును చేరుకోగలిగింది. ఎందుకంటే, టాప్ ఆర్డర్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఈ సమయంలో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా 3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

హార్దిక్-కృనాల్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్..

ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయిన బరోడా 10 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 11వ ఓవర్లో శ్రేయాస్ గోపాల్ తన మ్యాజిక్ చూపించాడు. అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ 37 బంతుల్లో వేగంగా 67 పరుగులు చేసిన శాశ్వత్ రావత్‌ను 11వ ఓవర్ మొదటి బంతికే అవుట్ చేశాడు. ఈ వికెట్ జట్టుకు ఉపశమనం కలిగించింది. కానీ, గోపాల్ తర్వాతి రెండు బంతుల్లో బరోడాకు బిగ్ షాక్ ఇచ్చాడు. కేవలం ఒక బంతిని ఆడి ఔట్ అయిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను రెండో బంతికి ఔట్ చేసిన గోపాల్, మూడో బంతికి జట్టు కెప్టెన్ కృనాల్‌ను కూడా 0 పరుగులకే అవుట్ చేశాడు. దీంతో గోపాల్ హ్యాట్రిక్ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

అయినా ఓడిన జట్టు..

అయినప్పటికీ లోయర్ ఆర్డర్‌లో శివాలిక్ శర్మ, విష్ణు వినోద్ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేయడంతో విజయం బరోడాకు దక్కింది. లక్ష్యాన్ని బరోడా కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమిలోనూ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి హ్యాట్రిక్ తీయడమే కాకుండా 4 వికెట్లు పడగొట్టిన శ్రేయాస్ గోపాల్ ఆటతీరు అద్భుతంగా ఉంది. శ్రేయాస్ గోపాల్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. IPL మెగా వేలం తర్వాత అతని ప్రదర్శన ప్రారంభమైంది. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అతనిని కేవలం రూ. 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..