
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో ప్రారంభమైంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి సారించారు. అయితే, తొలి మ్యాచ్ నుంచే పాకిస్తాన్ను దారుణంగా అవమానిస్తున్నారు. ఖాళీ స్టేడియం చూసిన తర్వాత, పాకిస్తాన్ను ప్రపంచవ్యాప్తంగా ఎగతాళి చేస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ లెజెండ్ మైఖేల్ వాఘన్ కూడా పాకిస్థాన్ను అవమానించేందుకు ముందుకు వచ్చాడు.
1996లో పాకిస్తాన్లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించింది. 29 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా మైఖేల్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ అభిమానుల కొరత కారణంగా, అతను పాకిస్తాన్ను ఎగతాళి చేశాడు. వాఘన్ ట్వీట్ చేస్తూ, ‘పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం చూడటం చాలా బాగుంది. 1996 తర్వాత మొదటి ప్రధాన ఈవెంట్. స్థానికులకు ఈ విషయం చెప్పడం మర్చిపోయారా?’ జనసమూహం ఎక్కడ ఉంది?’ అంటూ విమర్శలు గుప్పించాడు.
Great to see the champions trophy being played in Pakistan .. First major event since 1996 .. Have they forgotten to tell the locals it’s on .. Where is the crowd ?? #ChampionsTrophy2025
— Michael Vaughan (@MichaelVaughan) February 19, 2025
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైంది. మొదటి మ్యాచ్కి పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించారు. పాకిస్తాన్లో 29 సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేక సందర్భం వచ్చిన సందర్భంలో భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని భావించారు. కానీ, టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు తీవ్రమైన నిరాశ ఎదురైంది. నేషనల్ బ్యాంక్ స్టేడియంలోని చాలా స్టాండ్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఏమి జరుగుతుందో మనం చూడాల్సి ఉంది. ప్రారంభ మ్యాచ్కే ఇలా ఉంటే, ఇక ఇతర మ్యాచ్లకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
వార్త రాసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. విల్ యంగ్ 107, టామ్ లాథమ్ 115 నాటౌట్, ఫిలిప్స్ 61తో పాకిస్తాన్ జట్టుకు భారీ టార్గెట్ అందించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..