AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: మలేషియాపై షఫాలీ విధ్వంసం.. నేరుగా సెమీస్‌కు చేరిన భారత్..

INDW vs MLYW, Asian Games 2023: ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచేందుకు భారత్ మహిళల జట్టు ఇంకో 2 అడుగుల దూరంలోనే ఉంది. వర్షానికి ముందు టాస్ గెలిచిన మలేషియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ స్మృతీ మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే కెప్టెన్ మంధాన 27 పరుగుల తర్వాత..

Asian Games 2023: మలేషియాపై షఫాలీ విధ్వంసం.. నేరుగా సెమీస్‌కు చేరిన భారత్..
Indian Women's Team
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 21, 2023 | 12:49 PM

Share

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరింది. మలేషియా మహిళల జట్టుతో నేడు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కి చేరింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్‌లో ఉండడంతో భారత్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిందని అంపైర్లు ప్రకటించారు. అంటే ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచేందుకు భారత్ మహిళల జట్టు ఇంకో 2 అడుగుల దూరంలోనే ఉంది. వర్షానికి ముందు టాస్ గెలిచిన మలేషియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ స్మృతీ మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే కెప్టెన్ మంధాన 27 పరుగుల తర్వాత వెనుదిరిగింది. అనంతరం షఫాలీతో జతకట్టేందుకు క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ 29 బంతుల్లోనే 6 ఫోర్లతో అజేయంగా 47 పరుగులు చేసింది.

ఇక ఓపెనర్‌గా వచ్చిన షఫాలీ అయితే 39 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 67 పరుగులు చేసి వెనుదిరిగింది. అనంతరం వచ్చిన రిచా ఘోష్ కేవలం 7 బంతుల్లోనే 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మొత్తం 21 పరుగులు చేసి రోడ్రిగ్స్‌‌తో పాటు అజేయంగా నిలిచింది. దీంతో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మలేషియాన్ బౌలర్లలో మహీరా ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ తీసుకున్నారు.

ఇలా టీమిండియా ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు మలేషియా క్రీజులోకి వచ్చి రెండు బంతులు ఆడగానే వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం అగకపోవడంతో.. మ్యాచ్‌ని రద్దు చేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్ సెమీస్‌కి అర్హత సాధించినట్లుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో భారత మహిళల జట్టు సెప్టెంబర్ 24న తొలి సెమీ ఫైనల్‌లో ఆడనుంది. అయితే భారత్ ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!