T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ఇదే.. జట్టుకు మెంటార్‌గా ధోని..

Indian Team: అక్టోబర్-నవంబర్ మధ్య యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పెద్దగా సంచలనాలు..

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ఇదే.. జట్టుకు మెంటార్‌గా ధోని..
Cricket
Follow us

|

Updated on: Sep 08, 2021 | 9:47 PM

అక్టోబర్-నవంబర్ మధ్య యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకపోయినప్పటికీ.. దాదాపు నాలుగేళ్ల తర్వాత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 జట్టులో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే ఆఫ్ స్పిన్నర్ చాహాల్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. ఎంపికైన భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెంటార్‌గా వ్యవరించనున్నాడు.

జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ

స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్

కాగా, అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 14న జరగనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 2లో ఇండియా.. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లతో పోటీ పడనుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 24వ తేదీతో పాకిస్థాన్‌తో తలబడనున్న కోహ్లీసేన.. నవంబర్ 8న గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్ ఆడుతుంది. అటు సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డేస్ ఉన్నట్లు ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. భారత్ కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానున్నాయి.