AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh : 5 వికెట్లు తీసినా టీ20 చరిత్రలో అర్ష్‌దీప్ సింగ్ వింత రికార్డు…ఇదేంటి ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా ?

Arshdeep Singh : తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో స్టేడియం హోరెత్తిపోయింది. టీమిండియా ఏకంగా 271 పరుగుల భారీ స్కోరు సాధించి, కివీస్‌ను 46 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

Arshdeep Singh : 5 వికెట్లు తీసినా టీ20 చరిత్రలో అర్ష్‌దీప్ సింగ్ వింత రికార్డు...ఇదేంటి ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా ?
Arshdeep Singh
Rakesh
|

Updated on: Feb 01, 2026 | 4:01 PM

Share

Arshdeep Singh : తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో స్టేడియం హోరెత్తిపోయింది. టీమిండియా ఏకంగా 271 పరుగుల భారీ స్కోరు సాధించి, కివీస్‌ను 46 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగినా, ఒక చేదు రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో శివతాండవం చేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్ కివీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు. కేవలం కొన్ని బంతుల్లోనే 103 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ ఫామ్ చూపించాడు. అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (63), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 271 పరుగుల హిమాలయమంత స్కోరును బోర్డుపై ఉంచింది. కివీస్ బౌలర్లు ఎక్కడా భారత బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా గట్టిగానే పోరాడింది. ఫిన్ అలెన్ (80) ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి రెండు ఓవర్లలో ఏకంగా 40 పరుగులు పిండుకున్నారు. ఆ సమయంలో భారత్ ఓడిపోతుందేమో అన్న అనుమానం కలిగింది. కానీ అర్ష్‌దీప్ అద్భుతంగా పుంజుకున్నాడు. తన తర్వాతి రెండు ఓవర్లలో లైన్ అండ్ లెంగ్త్ మార్చి, వేగంలో వైవిధ్యం చూపిస్తూ వరుసగా వికెట్లు తీశాడు. చివరికి 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అర్ష్‌దీప్‌కు మొదటి టీ20 ఫైవ్ వికెట్ హాల్.

అయితే ఇక్కడే ఒక అరుదైన, ఎవరూ కోరుకోని రికార్డు అర్ష్‌దీప్ పేరు మీద నమోదైంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. 5 వికెట్లు తీసిన ఆనందం ఉన్నా, 51 పరుగులు ఇవ్వడం అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరోవైపు అక్షర్ పటేల్ 3 వికెట్లతో రాణించడంతో కివీస్ 225 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 4-1తో ముగించింది. మొత్తానికి ఈ మ్యాచ్ అర్ష్‌దీప్‌కు ఒక పాఠం లాంటిదనే చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..