CSK vs DC: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 లైఫ్‌లైన్‌లు భయ్యో! కావాలనే 3D శంకర్ ను అవుట్ చెయ్యలేదంటోన్న ఫ్యాన్స్!

ఐపీఎల్ 2025లో CSK vs DC మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు ఏకంగా నాలుగు లైఫ్‌లైన్‌లు లభించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఢిల్లీ బౌలర్లు అతన్ని ఔట్ చేయడంలో వరుసగా తప్పులు చేయగా, రెండు క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయి. ఈ కారణంగా శంకర్ "లక్కీ బాయ్"గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మ్యాచ్‌లో శంకర్ 69*, ధోని 30* పరుగులు చేసినా చెన్నై గెలుపును అందుకోలేకపోయింది.

CSK vs DC: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 లైఫ్‌లైన్‌లు భయ్యో! కావాలనే 3D శంకర్ ను అవుట్ చెయ్యలేదంటోన్న ఫ్యాన్స్!
Vijayshankarlonewarrior

Updated on: Apr 05, 2025 | 8:36 PM

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ అదృష్టం పరాకాష్టకు చేరుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ పోరులో శంకర్ నానా తప్పిదాల మధ్య కూడా క్రీజ్‌లో నిలవడం క్రికెట్ అభిమానుల మతులు పోగొట్టేలా చేసింది. మొదట మిచెల్ స్టార్క్ వేసిన బంతికి శంకర్ ముందు నుంచి ప్లంబ్ అయినట్లు కనిపించినా అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో డీసీని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ కెప్టెన్ DRS కూడా వారి దురదృష్టాన్ని తేటతెల్లం చేసింది.

అంతే కాదు, ఆ తర్వాత గోల్డెన్ రనౌట్ అవకాశం వచ్చింది దాన్ని డీసీ మిస్ చేసింది. అదికాకుండా శంకర్ రెండు కీలక క్యాచ్‌ల నుంచి కూడా తప్పించుకున్నాడు. మొదట కుల్దీప్ యాదవ్ ఒక క్యాచ్ వదిలేశాడు, తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ మరో క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. దీంతో శంకర్‌కు ఒకటి కాదు నాలుగు లైఫ్‌లైన్‌లు లభించాయి. ఈ సంఘటనలన్నీ శంకర్‌ను “లక్కీ బాయ్”గా మార్చేయగా, సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

ట్విట్టర్‌లో చాలా మంది వినోదభరితమైన సూచనతో, “డీసీ ఉద్దేశంగా శంకర్‌ను ఔట్ చేయడంలేదు” అంటూ విమర్శలు గుప్పించారు. మరికొందరు “CSK మిడిల్ ఆర్డర్‌ని కవర్ చేయడానికే శంకర్ ఇలా లైఫ్‌లైన్‌లు పొందాడు” అంటూ ట్రోల్స్‌కు తెరతీశారు. క్రికెట్ విశ్లేషకులు ఈ మ్యాచ్‌ను “శంకర్‌ గ్రేట్ ఎస్కేప్స్” అనే పేరుతో పిలుస్తూ చమత్కరించారు.

క్రికెట్‌లో అదృష్టం ఎలా పనిచేస్తుందో ఈ మ్యాచ్‌లో మరోసారి రుజువు చేసింది. సాధారణంగా ఒక ప్లేయర్‌కు ఒక అవకాశం రావడమే అరుదైతే, శంకర్‌కు నాలుగు లైఫ్‌లైన్‌లు రావడం అత్యాశ్చర్యంగా. అభిమానుల కన్నా ముందు దేవతలే అతని క్రీజ్‌ను కాపాడినట్లుగా కనిపించింది. ఈ సంఘటనలన్నీ కలిసి మ్యాచ్, ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో శంకర్ పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఐపీఎల్ 2025లో శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతనికి సహాయంగా అభిషేక్ పోరెల్ 33 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 24 నాటౌట్, సమీర్ రిజ్వీ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్ రెండు కీలక వికెట్లు తీసి రాణించాడు.

లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 184 పరుగుల కోసం బరిలోకి దిగగా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేయగలిగింది. విజయ్ శంకర్ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన ఎంఎస్ ధోని తన దూకుడుతో అభిమానులను అలరించాడు. ఆయన 30 పరుగులతో అజేయంగా మిగిలాడు. అయితే, ఈ ఇద్దరి ఒత్తిడిని తట్టుకునే పోరాటం చాలినంతగా కాకపోవడంతో చెన్నై జట్టు విజయం దక్కించుకోలేకపోయింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..