AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: భారత బాక్సర్ జీవితాన్ని మార్చిన రూ. 32 బిలియన్ల పోటీలు.. ఆయనెవరు, ఆ కథేంటంటే?

2015లో ఫ్లాయిడ్ మేవెదర్, మానీ పాక్వియావోల మధ్య 'ఫైట్ ఆఫ్ ది సెంచరీ' మ్యాచ్ జరిగింది. ఇందులో బాక్సర్లిద్దరూ భారీగా డబ్బుల వర్షం కురిపించారు.

CWG 2022: భారత బాక్సర్ జీవితాన్ని మార్చిన రూ. 32 బిలియన్ల పోటీలు.. ఆయనెవరు, ఆ కథేంటంటే?
Commonwealth Games 2022 Floyd Mayweather
Venkata Chari
|

Updated on: Jul 23, 2022 | 9:01 PM

Share

దిగ్గజ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్, మానీ పాకియావో మధ్య 2015లో ఫైట్ ఆఫ్ ది సెంచరీ మ్యాచ్ జరిగింది. ప్రపంచం మొత్తం చూపు ఆ మ్యాచ్‌వైపు ఆసక్తిగా చూసింది. భారత్‌లో కూడా ఫైట్ ఆఫ్ ది సెంచరీ మ్యాచ్ గురించే చర్చలు. ఫైట్ ఆఫ్ ది సెంచరీ మ్యాచ్ ఆదాయం దాదాపు 32 బిలియన్లు. ఈ ఒక్క మ్యాచ్ ఓ భారతీయుడి జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సింగ్ జట్టులో కీలక ప్లేయర్ అయిన సాగర్ అహ్లావత్.. ఈ మ్యాచ్‌తోనే తన ప్రయాణాన్ని మర్చుకున్నాడు

జీవిత లక్ష్యం..

2015లో జరిగిన ‘ఫైట్ ఆఫ్ ది సెంచరీ’పై వార్తాపత్రికలో వచ్చిన కథనాలతో సాగర్ ఈ క్రీడను ఎంచుకున్నాడు. 20 ఏళ్ల సాగర్ కామన్వెల్త్‌లో +92 కేజీల సూపర్ హెవీవెయిట్ ఈవెంట్‌లో సవాలు చేయనున్నాడు. ఈమేరకు సాగర్ పీటీఐతో మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచి చదువు రాదు. అందుకే 12వ తరగతి తర్వాత ఏదైనా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇదే సమయంలో ఫైట్ ఆఫ్ ది సెంచరీ నాజీవితాన్ని మార్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. సాగర్ రైతు కుటుంబంలో పుట్టాడు. వ్యవసాయానికి చెందిన సాగర్‌కు క్రీడలతో సంబంధం లేదు. మేవెదర్, పాకియావోల పోటీ గురించి అతను వార్తాపత్రికలలో చదివాడు. ఇద్దరు లెజెండ్‌ల గురించి తెలుసుకుని, 2017 లో బాక్సింగ్ ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

అరంగేట్రంలోనే రజత పతకం..

రెండేళ్ల తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో కూడా సత్తా చూపి వరుసగా టైటిల్స్ సాధించింది. అతను 2021లో సీనియర్ జాతీయ పోటీలో అరంగేట్రం చేసి మొదటి ప్రయత్నంలోనే రజతం సాధించాడు. దీని తర్వాత అతను జాతీయ శిబిరంలో కూడా చేరాడు. కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లోనూ సాగర్ అద్భుత ప్రదర్శన కొనసాగింది. అతను మొదట టోక్యో ఒలింపిక్ క్వార్టర్-ఫైనలిస్ట్ సతీష్ కుమార్‌ను ఓడించాడు. ఆ తర్వాత డిఫెండింగ్ జాతీయ ఛాంపియన్‌ని బర్మింగ్‌హామ్‌కు టికెట్ పొందాడు. సాగర్‌కి ఇది మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్. మొదటి ప్రయత్నంలోనే చరిత్ర సృష్టించడంపై అతని దృష్టి నెలకొంది.

Follow Us