AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనీ కోసం సాక్షి సర్‌ప్రైజ్..!

టీమ్ ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు షాట్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కశ్మీర్ లో భారత్ ఆర్మీతో పనిచేస్తున్నాడు. పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో రెజిమెంట్ యూనిట్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15 వరకు అతను విధుల్లో కొనసాగుతాడని ఇప్పటికే ఆర్మీ ఆఫీసర్స్ వెల్లడించారు. అయితే, త్వరలో ఇంటికి రాబోతున్న ధోని కోసం అతని భార్య సాక్షి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ఎదురు చూస్తోందట. […]

ధోనీ కోసం సాక్షి సర్‌ప్రైజ్..!
Pardhasaradhi Peri
|

Updated on: Aug 10, 2019 | 7:12 PM

Share

టీమ్ ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు షాట్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కశ్మీర్ లో భారత్ ఆర్మీతో పనిచేస్తున్నాడు. పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో రెజిమెంట్ యూనిట్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15 వరకు అతను విధుల్లో కొనసాగుతాడని ఇప్పటికే ఆర్మీ ఆఫీసర్స్ వెల్లడించారు. అయితే, త్వరలో ఇంటికి రాబోతున్న ధోని కోసం అతని భార్య సాక్షి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ఎదురు చూస్తోందట. ఈ మేరకు సాక్షి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ధోనీ కోసం ఇంటి వద్ద తనకిష్టమైన గిఫ్ట్ రెడీగా ఉందంటూ.. పోస్ట్ పెట్టిన ఆమె..అతనికి అత్యంత ప్రీతికరమైన ఎ జీప్ గ్రాండ్ చెరోకీ అనే అద్భుతమైన కారును కొనిందట. ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోనీకి కార్లన్నా, బైక్ లన్నా ఎంతో ఇష్టమని చెప్పారు సాక్షి.