AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బౌండరీ కౌంట్‌’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ

2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ. దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్‌లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని […]

‘బౌండరీ కౌంట్‌’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 7:47 AM

Share

2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా తొలి అడుగు పడింది. ఈ రూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అధ్యక్షతన ఓ అపెక్స్ కమిటీని నియమించింది ఐసీసీ.

దీనిపై ఐసీసీ జనవర్ మేనేజర్ జేఫ్ అలార్డైస్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ ఫైనల్‌లో జరిగిన వివాదాలపై ఐసీసీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కుంబ్లే అధ్యక్షత వహిస్తాడు. వచ్చే సమావేశంలో ఈ వివాదాస్పద అంశాన్ని కమిటీ చర్చించనుంది. సూపర్ ఓవర్లో ఫలితం తేలకపోతే బౌండరీ కౌంట్ విధానాన్ని 2009 నుంచి ఉపయోగిస్తున్నాం. దాదాపు అన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఈ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. బౌండరీ కౌంట్‌ క్రికెట్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది’’ అని పేర్కొన్నారు. కాగా జూలై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆ తరువాత సూపర్ ఓవర్లోనూ ఫలితం రాలేదు. దీంతో బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.