AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి చెప్పిన దైవ రహస్యం తెలిస్తే..?

పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది బిల్వ పత్రం. మారేడు వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, శివుని నివాసంగా భావిస్తారు. ఈ వృక్షం, శివార్చన విశిష్టత గురించి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శివారాధనలో మారేడు దళాలకు ఉన్న ప్రాధాన్యత, దాని ఫలితం ఎలా ఉంటుందో చాగంటి వారు స్పష్టంగా వివరించారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం..

మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి చెప్పిన దైవ రహస్యం తెలిస్తే..?
Bilva Tree Royalty
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2026 | 3:28 PM

Share

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మారేడు (బిల్వ) వృక్షం, శివారాధన వల్ల కలిగే విశేష ఫలితాల గురించి వివరించారు. పూలు పూయకుండానే కాయలు కాసే ఈ వృక్షం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని వివరించారు. శివారాధనలో మారేడు దళాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చాగంటి వారు పేర్కొన్నారు. మారేడు దళం కేవలం ఒక ఆకు కాదు, అది ఆధ్యాత్మిక శక్తికి మూలం. త్రిదళం (మూడు ఆకులు) కలిగిన బిల్వ పత్రం శివుని మూడు నేత్రాలకు, సత్వ-రజ-తమో గుణాలకు, త్రిశూలానికి చిహ్నంగా పేర్కొన్నారు.

“త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |

త్రిజన్మ పాపసంహారం ఏక బిల్వం శివార్పణం ||”

ఇవి కూడా చదవండి

ఈ శ్లోకం ప్రకారం ఒక్క మారేడు దళంతో శివుడిని పూజిస్తే మూడు జన్మల పాపాలు పటాపంచలు అవుతాయని చాగంటి వివరించారు. మారేడు చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి పూజించడం లేదా చెట్టు మొదట్లో నీరు పోసి నమస్కరించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. పువ్వులు పూయకుండానే కాయలు కాసే ఈ వృక్షం కింద జపం లేదా ధ్యానం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అరుణాచలం వంటి క్షేత్రాలలో అరుదుగా లభించే 9 ఆకుల బిల్వ దళాలకు మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.

ఆధ్యాత్మిక పురోగతి సాధించాలనుకునే వారికి భస్మం (విభూతి), బిల్వ పత్రం, రుద్రాక్ష అనేవి బాహ్య చిహ్నాలు మాత్రమే కాదు, అవి శక్తివంతమైన సాధనాలు. విభూతిని ధరించడం, బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. జ్ఞాన ప్రదాత అయిన శివుడిని బిల్వ పత్రాలతో కొలవడం ద్వారా అజ్ఞానం తొలగిపోయి, ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తాయి. మారేడు వృక్షాన్ని గౌరవించడం అంటే సాక్షాత్తు ప్రకృతిని, పరమేశ్వరుడిని పూజించడమేనని చాగంటి ప్రవచనాల్లో వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి