AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Utpanna Ekadashi: ఈ రోజు ఉత్పన్న ఏకాదశి.. ఏ శుభ సమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి

ఉత్పన్న ఏకాదశి అనేది హిందూ మతంలో విష్ణువుకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పర్వదినం. విశ్వాసం ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వలన మోక్షం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.

Utpanna Ekadashi: ఈ రోజు ఉత్పన్న ఏకాదశి.. ఏ శుభ సమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Utpanna Ekadashi 2024
Surya Kala
|

Updated on: Nov 26, 2024 | 6:17 AM

Share

శ్రీ మహా విష్ణు ఆరాధనకు ఉత్పన్న ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ సంవత్సరం 26 నవంబర్ 2024 న జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దేవి ఏకాదశి రోజున జన్మించింది. ఆమె పాపాలను నాశనం చేసి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం ప్రముఖమైనవి. ఈ యోగాలలో శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరి కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి.

ఉత్పన ఏకాదశి తిథి ఉత్పన్న ఏకాదశి తిథి

పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి మంగళవారం నవంబర్ 26వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 01:01 నుంచి మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ బుధవారం తెల్లవారుజామున 03:47 వరకు ఆచరిస్తారు. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 26న మాత్రమే ఆచరిస్తారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు ఉపవాసం విరమించవచ్చు.

ఉత్పన్న ఏకాదశి పూజ, శుభ సమయం

పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి పూజ సమయం నవంబర్ 26 ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ శుభ యోగంలో శ్రీవిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఉత్పన ఏకాదశి దీక్ష విరమణ సమయం

ఏకాదశి ఉపవాసం చేసిన వారు మర్నాడు అంటే ద్వాదశి తిధి లో ఉపవాసం విరమిస్తారు. ఈ నేపధ్యంలో రేపు 27 నవంబర్ 2024న ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. పరణకు ఉత్తమ సమయం మధ్యాహ్నం 1:12 నుంచి 3:18 వరకు. పరణకు ముందు శ్రీ విష్ణువు ను ధ్యానించండి. తరువాత దీక్ష విరమణ చేయండి.

ఉత్పన ఏకాదశి పూజా విధానం, పూజ విధి

ఉపవాసం రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీమాత విగ్రహాలను ప్రతిష్ఠించాలి. తర్వాత పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేసి నెయ్యి దీపం వెలిగించాలి. “ఓం నమో నారాయణ” అనే మంత్రాన్ని జపించండి. అలాగే విష్ణువుకు తమలపాకులు, కొబ్బరికాయ, పండ్లు, పంచామృతం, అక్షతం, స్వీట్లు, చందనం సమర్పించండి. చివర్లో హారతి ఇచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి.

ఉత్పన ఏకాదశి ప్రాముఖ్యత

సనాతన ధర్మం నమ్మకం ప్రకారం ఏకాదశిని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన అన్ని రకాల పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మోక్షం, విష్ణులోకంలో స్థానం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుని కోరికలన్నీ నెరవేరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఈ ఉపవాసం పాపాల నుంచి విముక్తి పొందడమే కాకుండా జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.