నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి
నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి తన కూతురిని అత్యాచారం చేసి చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టుమార్టం నివేదికను విస్మరించి, సాక్ష్యాలను తారుమారు చేశారని ఆమె వాపోయారు. 23 ఏళ్లుగా ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తమ కుటుంబానికి ఎవరూ అండగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నటి ప్రత్యూష మరణం వెనుక అసలు నిజాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని ఆమె తల్లి సరోజినీ దేవి వాపోయారు. తన కూతురిని అత్యాచారం చేసి, హత్య చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యూష శరీరం మీద పలుచోట్ల గోర్లతో రక్కిన గాయాలు, మెడపై ఒత్తిన గుర్తులు ఉన్నాయని డాక్టర్ మునిస్వామి సమర్పించిన పోస్టుమార్టం నివేదిక స్పష్టంగా పేర్కొందని సరోజినీ దేవి తెలిపారు. అయితే, ఈ నివేదికను సీబీఐ, సెషన్స్ కోర్టు, హైకోర్టు వంటి ఏ సంస్థ కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి విరుద్ధంగా, ఒక నెల తర్వాత ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ, మృతదేహాన్ని పరిశీలించకుండా కేవలం కొన్ని నివేదికల ఆధారంగా ప్రత్యూషది ఆత్మహత్య అని తేల్చిందని, ఆ నివేదికను మాత్రమే స్వీకరించారని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు
KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

