AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఎన్ని కోట్లు వచ్చిదంటే..

వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను కానుకల రూపంలో సమర్పించుకుంటారు. అయితే శ్రీవారి వార్షిక ఆదాయం ఏడాదికి లక్షరూపాయలు దాటేది కాదు.. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వివిధ కారణాలతో రోజు రోజుకీ స్వామివారి హుండీ ఆదాయం లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన వెంకన్న హుండీ ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..  

Tirumala: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఎన్ని కోట్లు వచ్చిదంటే..
Tirumala Hundi Collections
Raju M P R
| Edited By: |

Updated on: Dec 03, 2023 | 1:24 PM

Share

కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను కానుకల రూపంలో సమర్పించుకుంటారు. అయితే శ్రీవారి వార్షిక ఆదాయం ఏడాదికి లక్షరూపాయలు దాటేది కాదు.. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వివిధ కారణాలతో రోజు రోజుకీ స్వామివారి హుండీ ఆదాయం లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన వెంకన్న హుండీ ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవంబర్ నెల ఆదాయం రూ. 108.46 కోట్లు గా టీటీడీ ప్రకటించింది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ వెంకన్న హుండీలో సమర్పించిన నెల రోజుల కానుకల మొత్తం రూ. 108.46 కోట్లు వచ్చింది. నవంబర్ నెలలో 19.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ మేరకు రోజు వారీ హుండీ కానుకలను లెక్కించిన టీటీడీ నెల మొత్తంలో వచ్చిన ఆదాయాన్ని వివరించింది. ప్రతినెల డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, వారు హుండీ లో సమర్పించిన కానుకలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు, అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు, లడ్డూల విక్రయం వివరాలను ఈఓ ప్రకటిస్తున్నారు.

ఇందులో భాగంగానే టీటీడీ ఈవో ధర్మారెడ్డి నవంబర్ నెల వివరాలను భక్తులకు వివరించారు. రూ. 108.46 కోట్ల హుండీ ఆదాయంతో పాటు భక్తులకు 94.47 లక్షల లడ్డూల విక్రయించినట్లు చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో 36.50 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించగా 7.06 లక్షల మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!