ఆ తర్వాత దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది సాధువులు ఇతర, పీఠాధిపతులు పాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 కి పూర్ణాహుతి.. కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2.30కి ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి తో ఈ రోజు కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.
114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహా క్రతువును చూసేందుకు పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన వారు ఇక్కడకు విచ్చేస్తున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. ఇవాళ ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహ దర్శనం చేసుకోనున్న ప్రముఖుల విషయానికి వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ సందర్శించనున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధ్యాహ్నం 3.30 కి ముచ్చింతల్కు రానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొంటారు. ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించనున్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు
– ఉదయం 6.30 గంటలకుఅష్టాక్షరీ మంత్ర పఠనం
– ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన.
– ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
– ఉదయం 10 గంటలకు ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి
– ఉదయం 10 గంటలకు సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి
– ఉదయం 10.30 గంటలకు యాగశాలలో చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ
– ఉదయం 10.30 గంటలకు దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు. ఇందులో 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు. పాల్గొననున్నారు.
– మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి
– మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచనమండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు
– సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
– రాత్రి 9 గంటలకు పూర్ణాహుతిజ