Snake in Temple: శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. శివుని ప్రతిరూపంగా భావించి పూజలు

మహా పర్వదినం శివరాత్రి రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు.

Snake in Temple: శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. శివుని ప్రతిరూపంగా భావించి పూజలు
Snake In Temple

Updated on: Feb 19, 2023 | 10:12 AM

మహా శివరాత్రి  రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి ఆ పరమ శివుడిని దర్శించుకున్నారు. అయితే మహా పర్వదినం శివరాత్రి రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో  చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

నిర్మల్ జిల్లా దస్తూరబాద్ మండలంలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. రాత్రి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. లయకారుడైన శంకరుడు కంఠాభరమైన నాగుపాము భక్తులకు దర్శనం ఇచ్చింది. మండలంలోని గొడిసేర్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం ఇచ్చింది. నాగుపాముని చూసిన స్థానికులు భక్తి పరవశులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు సమర్పించారు. నాగుపాము పడగవిప్పి భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది. మహా శివరాత్రి పర్వదినాన నాగు పాము దర్శనంతో తమ జన్మ ధన్యమైందని  స్థానికులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నాగుపాముని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us