
సనాతన ధర్మంలో స్కంద షష్టి వ్రతానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర ఉపవాసం దేవతల సైన్యాధిపతి, పరమశివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడుకు అంకితం చేయబడింది. ఆయనను మురుగన్, సుబ్రహ్మణ్యుడు అని కూడా పిలుస్తారు. ప్రతి నెల శుక్ల పక్షంలోని ఆరవ తిథి (షష్ఠి) రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు భక్తులు ఉపవాసం పాటించి, విధి విధానాలతో కార్తికేయ స్వామిని ఆరాధిస్తారు. భక్తితో చేసిన ఈ వ్రతం వల్ల ఆరోగ్యం, విజయం, శత్రు నివారణ, సంతాన ప్రాప్తి వంటి అనేక శుభఫలాలు లభిస్తాయని శాస్త్ర విశ్వాసం.
షష్ఠి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 22, 2026 – ఉదయం 11:09 గంటలకు
షష్ఠి తిథి ముగింపు: ఫిబ్రవరి 23, 2026 – ఉదయం 9:09 గంటలకు
అందువల్ల స్కంద షష్టి వ్రతం ఫిబ్రవరి 22, 2026 (ఆదివారం) నాడు ఆచరించబడుతుంది.
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05:12 నుంచి 06:03 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:12 నుంచి 12:58 వరకు
అమృత కాలం: ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు
సంధ్యా సమయం: సాయంత్రం 06:14 నుంచి 06:39 వరకు
నిశిత ముహూర్తం: అర్థరాత్రి 12:09 నుంచి 12:59 వరకు
ఈ సమయాల్లో పూజ చేస్తే శుభప్రదమని భావిస్తారు.
ప్రాతఃకాలంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి.
కార్తికేయ స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి.
దీపం వెలిగించి, పుష్పాలు, పండ్లు, నైవేద్యం సమర్పించాలి.
స్కంద షష్టి వ్రత కథను పఠించాలి.
“ఓం సరం సరవణభవాయ నమః” వంటి మంత్రాలను జపించాలి.
చివరగా హారతి ఇచ్చి ప్రార్థనతో పూజను ముగించాలి.
రోజంతా ఉపవాసం పాటించి, శుద్ధమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి (లేదా ఫలాహారం).
బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
ప్రతికూల ఆలోచనలు, ఇతరులపై చెడు మాటలు దూరంగా ఉంచాలి.
సూర్యోదయం తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
మరుసటి రోజు పూజ అనంతరం ఉపవాసాన్ని విరమించాలి.
ఆ రోజు శాంతంగా, భక్తితో గడపాలి.
భక్తి, నమ్మకం, నియమ నిష్ఠలతో స్కంద షష్టి వ్రతాన్ని ఆచరిస్తే కార్తికేయ స్వామి కృపాకటాక్షం లభించి జీవితం సుఖశాంతులతో నిండుతుందని పురాణాలు చెబుతున్నాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. దీనిని సంస్థ ధృవీకరించదు.)