
స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని శాంతి లభిస్తుందని నమ్మకం. సుబ్రమణ్య స్వామి భక్తులకు స్కంద షష్ఠి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ బలం, విజయం, ధైర్యానికి చిహ్నం.
దృక్ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి మార్చి 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:16 గంటలకు ప్రారంభం అవుతుంది. మర్నాడు మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:51 గంటలకు షష్టి తిధి ముగుస్తుంది. ఈ నేపధ్యంలో స్కంద షష్టి ఉపవాసం మార్చి 4న చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని దానాలు చేయడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని వెల్లడించారు.
స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం వలన భక్తుల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ చేసే పూజ, వ్రతం, ఉపవాసం వలన కోపం, దురాశ, అహంకారం, కామం వంటి చెడు గుణాలు తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్ఠి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానం లభిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపినవిషయాలు పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.