Bangeshwar Mahadev Mandir: 51 అడుగుల ఎత్తైన శివుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు..

|

Jul 30, 2023 | 1:32 PM

సమయం, ఆర్థిక కారణాల వల్ల అన్ని జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించడం సాధ్యం కాదు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు. వారు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒకే స్థలంలో ఒకే ఆలయంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర హౌరాలోని బంగేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చాలా పురాతనమైనప్పటికీ

Bangeshwar Mahadev Mandir: 51 అడుగుల ఎత్తైన శివుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు..
Bangeshwar Mahadev Temple
Follow us on

శ్రావణ మాసంలో పూజలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి, మంగళ గౌరీ లతో పాటు హరిహరులను ప్రత్యేకంగా పూజిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వివిధ దేవాలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. శివయ్యకు జలాభిషేకం చేసి పూజలను చేస్తారు. ఈ సమయంలో  శివ భక్తులు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. వారు జ్యోతిర్లింగాలను దర్శించి అభిషేకం చేసి శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు.

సమయం, ఆర్థిక కారణాల వల్ల అన్ని జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించడం సాధ్యం కాదు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు. వారు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒకే స్థలంలో ఒకే ఆలయంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు.

ఉత్తర హౌరాలోని బంగేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చాలా పురాతనమైనప్పటికీ. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఆలయ సముదాయంలో 51 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

51 అడుగుల ఎత్తైన శివుడు 

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..  51 అడుగుల ఎత్తైన శివుడు విగ్రహంతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారాల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతారు. శివునికి జలాభిషేకం చేస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు మహాదేవుని ప్రార్థిస్తారు.

బంగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పన్నెండు జ్యోతిర్లింగాలు

దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం,గుజరాత్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగం,నాగేశ్వర్ జ్యోతిర్లింగం,మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని వైజనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర్ జ్యోతిర్లింగం, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఆంధ్ర ప్రదేశ్ లో మల్లికార్జున జ్యోతిర్లింగం,ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం, తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు అన్నీ బంగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చి స్వామిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..