Navaratri 2025: దేవీ నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? తెలుసుకోండి..

శారదీయ నవరాత్రి ఉత్సవాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ నవరాత్రులు దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దేవీ స్వరూపానికి పూజ చేయడం, ఉపవాసం ఉండటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అయితే అమ్మవారి అనుగ్రహం కోసం దేవీ నవరాత్రులలో కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయడం శుభం..

Navaratri 2025: దేవీ నవరాత్రుల్లో అమ్మ అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? తెలుసుకోండి..
Shardiya Navratri 2025

Updated on: Sep 16, 2025 | 3:05 PM

పవిత్రమైన శారదీయ నవరాత్రి పండుగ 2025 సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై, 2025 అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ పండుగ దుర్గాదేవి తొమ్మిది రూపాలకు అంకితం చేయబడింది. ఈ సమయంలో భక్తులు ఉపవాసం ఉండి నవ దుర్గలకు పూజలు చేస్తారు. అదే సమయంలో నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కనుక ఈ రోజు నవరాత్రి సమయంలో మనం ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

నవరాత్రులలో ఏమి చేయాలంటే

  1. కలశ స్థాపన, పూజ – నవరాత్రి మొదటి రోజున శుభ సమయంలో కలశాన్ని ప్రతిష్టించండి. ఇది దేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి చిహ్నం. దీని తరువాత తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించండి.
  2. పరిశుభ్రత – నవరాత్రి సమయంలో ఇంటిని, పూజ స్థలాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోండి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.
  3. అఖండ జ్యోతి – నవ రాత్రి ప్రారంభం రోజున అఖండ జ్యోతిని వెలిగించాలని కోరుకుంటే.. తొమ్మిది రోజుల పాటు అఖండ జ్యోతిని ఆరిపోకుండా చూసుకోండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
  4. సాత్విక ఆహారం – ఉపవాసం ఉన్నవారు పండ్లు, పాలు, వాటర్ చెస్ట్నట్ పిండి మొదలైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. మంత్రాలు జపించండి – నవరాత్రి సమయంలో దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలను జపించండి. దుర్గా సప్తశతి పఠించండి. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. పూజ ఫలితాలను ఇస్తుంది.
  7. దానధర్మాలు – నవరాత్రి సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ కాలంలో అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి.

నవరాత్రులలో ఏమి చేయకూడదంటే

  1. తామసిక ఆహారం – నవరాత్రుల తొమ్మిది రోజులలో తామస ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు. తామస వస్తువులను తినడం వల్ల శరీరంలో ,మనసులో బద్ధకాన్ని, మందకొడితనాన్ని కలిగిస్తాయి. దీంతో పూజకు ఆటంకం కలుగుతుంది.
  2. జుట్టు, గోర్లు – నవరాత్రి సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు.
  3. తోలు వస్తువులు: ఉపవాస సమయంలో బెల్టులు, పర్సులు, బూట్లు, చెప్పులు మొదలైన తోలు వస్తువులను ఉపయోగించవద్దు.
  4. మద్యం, పొగాకు – ఈ కాలంలో మద్యం, పొగాకు వినియోగం నిషేధించబడింది. ఈ విషయాలు ఆరాధన పవిత్రతకు భంగం కలిగిస్తాయి.
  5. పగలు నిద్రపోవద్దు – మీరు ఉపవాసం ఉండి ఉంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకుండా ఉండండి. ఇలా నిద్రపోవడం వలన ఉపవాసం చేసిన ఫలితం ఉండదు.
  6. ఎవరినీ అగౌరవపరచవద్దు – ఈ సమయంలో ఎవరినీ, ముఖ్యంగా స్త్రీలను, పెద్దలను అగౌరవపరచవద్దు. ఎందుకంటే దుర్గాదేవి స్త్రీ శక్తికి చిహ్నం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us