Ram Janmabhoom: నేపాల్‌ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామాలు.. శిలలతో శ్రీరాముడు, సీత విగ్రహాల తయారీ

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Feb 02, 2023 | 2:07 PM

యోధ్యలోని శ్రీరామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడి విగ్రహం నిర్మాణానికి ఉపయోగపడే రెండు పెద్ద శాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి.

Ram Janmabhoom: నేపాల్‌ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామాలు.. శిలలతో శ్రీరాముడు, సీత విగ్రహాల తయారీ
Shaligram Stones

అయోధ్యతో రామమందిరం నిర్మాణం పనులు చకచక సాగుతున్నాయి. శ్రీరాముడు , సీత విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ భారీ శిలలకు పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల నాటివని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేపాల్‌ నుంచి అయోధ్యకు తీసుకొచ్చే మార్గంలో ఈ శిలలకు భక్తులు పూజలు చేశారు. పలు చోట్ల ఘనస్వాగతం పలికారు.

శ్రీ విష్ణువు అవతారంగా సాలిగ్రామ శిలలను హిందువు భావిస్తారు. నేపాల్‍లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ సాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6కోట్ల ఏళ్ల నాటివనే నమ్మకం ఉంది.

2024కు ముందే సాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధమవుతోంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా సాలిగ్రామ శిలతో తయారు చేస్తున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు. 2024, జనవరి 1వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu