AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha Kumbh 2025: సమతా కుంభ్ 2025 ఉత్సవాలు.. 10 రోజుల పాటు ఆధ్యాత్మిక జాతర.. అందరికీ ఆహ్వానం

అపర రామానుజులు త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 దివ్య క్షేత్రాలు వెలిసి ఉన్నటువంటి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమతా కుంభ్ 2025 ఉత్సవాలు జరగనున్నాయని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి వారు వెల్లడించారు. ఉత్సవారంభ స్నపనం, అంకురారోపణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

Samatha Kumbh 2025: సమతా కుంభ్ 2025 ఉత్సవాలు.. 10 రోజుల పాటు ఆధ్యాత్మిక జాతర.. అందరికీ ఆహ్వానం
Samatha Kumbh 2025
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2025 | 8:03 AM

Share

అపర రామానుజులు త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 దివ్య క్షేత్రాలు వెలిసి ఉన్నటువంటి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 9వ తేదీ  నుంచి 19వ తేదీ వరకు సమతా కుంభ్ 2025 ఉత్సవాలు జరగనున్నాయని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి వారు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామనగరంలోని సమతామూర్తి దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ – 2025 మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమై.. 10 రోజులపాటు ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి వారు తెలిపారు.

ఫిబ్రవరి పదో తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా విశేషంగా ప్రతిరోజు సాయంకాలం పూట 18 గరుడ వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీన 108 దివ్య క్షేత్రాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళందరికీ కూడా సాయంకాలం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఒకే రోజున ఒకే సమయంలో 108 పెరుమాళ్ళ కళ్యాణాలు చూసే అదృష్టం ఉంటుందని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి తెలిపారు.

అలాగే 16వ తేదీన సాయంకాలం 18 దివ్యదేశ పెరుమాళ్లకి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది.. ఇలాంటి వైభవోపేతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నాయని.. ఇలాంటి ఉత్సవాల్లో మనందరం పాలుపంచుకుందామని.. శ్రీ త్రిదండి అహోబిలం స్వామి వారు భగవత్ భక్తులకు స్వాగతం పలికారు.

రామానుజ – నూత్తందాది అంటే ఏమిటి?

భగవద్రామానుజులపై పరమ భక్తితో తిరువరంగత్తు అముదనార్ అనే శిష్యుడు సమర్పించిన 108 పాశురాలే..ఈ నూత్తందాది! రామానుజులవారిని ఆశ్రయించిన వారికి ఈ సంసారాన్ని జయించే అనుగ్రహము లభిస్తుందని నమ్మకం!

సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాది రచించారు అముదనార్‌! ఆచార్య రామానుజులపై తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ప్రబంధం అత్యద్భుతం! ఇందులో పాశురం చివరి పదం తర్వాతి పాశురం మొదటి పదం అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్