Rudraksha: రుద్రాక్షను ధరించినవారు రుద్ర లోకాన్ని పొందుతారు..రుద్రాక్ష మహిమను తెలిపే కథ ఏమిటంటే

రుద్రాక్ష సారాన్ని జపిస్తే అనంతమైన ఫలితాలు పొందుతారు. భస్మం, రుద్రాక్షలను ధరించిన వారు మళ్ళీ గొప్ప జన్మను ఎత్తుతారు. రుద్రాక్షను ధరించి స్నానం చేస్తే గంగాస్నాన ఫలితాలు పొందుతారు. ఏదైనా రుద్రాక్షను ధరిస్తే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి.

Rudraksha: రుద్రాక్షను ధరించినవారు రుద్ర లోకాన్ని పొందుతారు..రుద్రాక్ష మహిమను తెలిపే కథ ఏమిటంటే
Rudraksha
Follow us

|

Updated on: Jan 06, 2023 | 4:40 PM

రుద్రాక్ష మహిమను వివరిస్తూ రుద్రాక్షని ధరిస్తే పాపాలు దరి చేరవు.. పుణ్య లోకాలను చేరుకుంటారని శృతి, స్మృతి  పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్ష ను స్పటికను బంగారంతో కలిపి ధరించిన వారు రుద్ర లోకాన్ని పొందుతారు. రుద్రాక్ష సారాన్ని జపిస్తే అనంతమైన ఫలితాలు పొందుతారు. భస్మం, రుద్రాక్షలను ధరించిన వారు మళ్ళీ గొప్ప జన్మను ఎత్తుతారు. రుద్రాక్షను ధరించి స్నానం చేస్తే గంగాస్నాన ఫలితాలు పొందుతారు. ఏదైనా రుద్రాక్షను ధరిస్తే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. దీనికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక కథను గురించి తెలుసుకుందాం..

పూర్వం కాశ్మీర్ దేశంలో భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతని వద్ద సుధర్ముడు అనే మంత్రి ఉండేవాడు. రాజుకు తారక అనే కుమారుడు..  మంత్రి సుధర్ముడికి సద్గుణ అనే కుమారుడు ఉన్నారు. ఈ పిల్లలు ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఎప్పుడూ కలిసి ఉంటూ ఉండేవారు.. రాజ్యభోగాలను, నగలను, పదవి వంటి వాటిని ఆశించకుండా, ప్రతిరోజూ రుద్రాక్షను ధరించి, శివుడిని పూజిస్తూ.. జీవిస్తుండేవారు. శివారాధన తర్వాత భోజనం చేసేవారు.

అప్పుడు ఒకరోజు పరాశర మహర్షి రాజభవనానికి వచ్చాడు. ఆయనకు అర్ఘ్యపాద్యాదితో స్వాగతం పలికి సత్కరించి పూజలు చేశారు. రాజు తన కొడుకు తారక గురించి, మంత్రి కొడుకు సుధర్మ గురించి, వారు రుద్రాక్షి ధరించడం గురించి మరియు ఇద్దరు పిల్లల వింత ప్రవర్తనకు కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు. దీని గురించి మహర్షి పరాశరుడు ఒక కథ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

రాజా, నంది అనే ఊరిలో ‘మహానంద’ అనే వేశ్య చాలా అందగత్తె.. ధనవంతురాలు. ఆమె గుణవంతురాలు.. మహానంద తన వృత్తి ధర్మాన్ని అనుసరించింది. పెద్దల దగ్గర దానధర్మాలు గురించి తెలుసుకుని దానధర్మాలు చేసింది. ఆమె ప్రతిరోజూ తనను తాను అలంకరించుకుని.. శివుని ఆరాదిస్తూ..  తన ఇంటిలోని నృత్య మందిరంలో భక్తితో నృత్యం చేసేది. ఒక కోడిని, కోతిని తనతో పాటు పెంచుకుంది. ఆ వేశ్య సరదాకి కోతిని, కోడిని రుద్రాక్షలను మాలగా చుట్టి అలంకరించేది.

ఒకరోజు శివవ్రతాన్ని చేస్తున్న ఒక ధనవంతుడైన వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. నుదిటిపై విభూతి, చేతులకు రత్న కంకణాలు, కుడిచేతిలో సూర్యుడిలా ప్రకాశిస్తున్న రత్న లింగం ఉన్నాయి. అది చూసి వేశ్య ముచ్చటపడి వైశ్య తన స్నేహితురాలితో చెప్పింది. ఆ హాల్లో కూర్చున్న ఆ ధనవంతుడు గొప్ప సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను ప్రసన్నం చేసుకుంటే, ఈ విలువైన లింగాన్ని ఆమెకు ఇస్తాను అన్నాడు. అది విని..  వేశ్య చాలా సంతోషించి, నేటి నుండి మూడు రాత్రులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతనితో  జీవించగలను  అని తన సఖి ద్వారా చెప్పింది. త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తాను అని చెప్పి, సూర్యచంద్రుల సాక్షిగా ఆ లింగంపై చేయి వేసింది.

అప్పుడు వైశ్యుడు ఆమె గుణం రత్నం అని నిశ్చయించుకుని శివలింగాన్ని ఇచ్చి.. ప్రియతమా, ఇది నా ప్రాణంతో సమానం.. జాగ్రత్త సుమా అని చెప్పాడు. ఆమె ఆ లింగాన్ని ఎంతో భక్తితో పూజించింది. వైశ్యుడు, వేశ్య ఇద్దరూ ఆ రాత్రి అంతఃపురం చేరారు. అదే సమయంలో విచిత్రంగా డ్యాన్స్ హాల్‌కు మంటలు అంటుకుని క్షణకాలంలో కాలిపోయింది. కోతి, కోడి కూడా దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల అందరూ కలిసి మంటలను ఆర్పారు. ఈ విషయం ఆ ధనవంతుడిని తెలియగా.. వెంటనే లింగాన్ని తలచుకుని విలపించాడు. నేను బతకలేను అని ఏడుస్తూ బూడిదను వెదికాడు.. అయినప్పటికీ ఆ లింగం మాత్రం దొరకలేదు.

దీంతో వైశ్యుడు చితిమంటలను పేర్చుకుని అందులో పడిపోయాడు. ఇది చూసిన వేశ్య కూడా పతివ్రతా ధర్మాన్ని అనుసరించి ప్రాణనాథుడంటూ అతనితో ప్రయాణం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమె వారించారు.. నువ్వు వేశ్య అని చెప్పడం ప్రారంభించారు. అయితే ఆమె వారి మాటలేవీ వినకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనిని ఆశ్రయించింది. ఇది మన ధర్మం.. ఇప్పుడు నేను ఇలా ధర్మాన్ని అనుసరించకపోయినట్లు అయితే.. 21 తరాలు నాతో నరకయాతన అనుభవిస్తాయి. ఇప్పుడు నేను నా ధర్మాన్ని అనుసరిస్తే వారందరూ రక్షించబడతారు. మరణం అనివార్యం కాదా? దుర్భర జీవితం గడపడం కంటే ధర్మాన్ని ఆచరించి రక్షించుకోవడం చాలా మేలు అంటూ ఆమె మంటల్లో పడింది.

వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై నీ గుణం, ధర్మ నిర్వహణను పరీక్షించాలనుకున్నాను.. నేనే ఆ వైశ్యుడి రూపంలో వచ్చాను. నేను నా ఆత్మను నీకు ఇచ్చాను…  నేనే ఈ మండపానికి నిప్పంటించి నీ పాత్రను పరీక్షించానని పేర్కొన్నాడు. దీంతో ఆ వేశ్య ఆశ్చర్యపోయింది.  భక్తితో నమస్కరించి.. “స్వామీ నాకు భూమి మీద భోగభాగ్యాలు అక్కర్లేదు. నన్ను ఈ సంసారం నుండి విముక్తి చేసి.. శాశ్వతమైన శివాయుజ్యాన్ని ప్రసాదించు” అని ప్రార్థించింది.

శివుడు సంతోషించి ఆమెను కైలాసానికి తీసుకెళ్లాడు. ఆ రోజు నర్తనశాలలో మంటల్లో చిక్కుకున్న కోడి, కోతి ఇప్పుడు ఈ పిల్లలుగా పుట్టాయి. పూర్వ జన్మ సంస్కారాల నుండి శివ భక్తులు అయినందున.. భస్మాన్ని , రుద్రాక్షిలను ప్రేమతో ధరిస్తారని పరాశర మహర్షి రాజుకి చెప్పాడు. కాశ్మీర్ రాజు భద్రసేనకు రుద్రాక్షి మహిమ ఇదంతా అని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)