Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక అప్ డేట్.. వీడియో.
అయోధ్యలోని రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు 2024 జనవరి 1 నాటికి పూర్తవుతాయని ప్రకటించిన అమిత్ షా మందిర ప్రారంభోత్సవ వేడుకలు కూడా అదే రోజున జరుగుతాయని పేర్కొన్నారు.
త్రిపురలోని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా ‘ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రామ మందిర సమస్యను కాంగ్రెస్ అడ్డుకుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం ప్రారంభమైంది’ అని అన్నారు. అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లోనే జరగనున్నాయి. దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలలో కూడా తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలో రామ మందిరంపై అమిత్ షా చేసిన ప్రకటన బీజేపీకి ఎంతో బలాన్ని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 06, 2023 06:27 PM
Follow Us
వైరల్ వీడియోలు
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

