AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!

Nija Jyeshta Masam: జూన్ 16 నుండి జులై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, దానధర్మాలు, తులసి పూజ, ఇంటి శుభ్రత పాటించడం ద్వారా శుభ ఫలితాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
Nija Jyeshta Masam
Rajashekher G
|

Updated on: Jun 15, 2026 | 10:07 PM

Share

Hindu Spiritual Practices: జూన్ 16 నుంచి జులై 14 వరకు కొనసాగే పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసం హిందూ ధర్మంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అధిక మాసం కారణంగా వాయిదా పడిన అనేక శుభకార్యాలైన వివాహాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాశన వంటివి ఈ మాసంలో నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో పాటించే నియమాలు, పూజలు విశేష ఫలితాలను ప్రసాదిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

లక్ష్మీ కటాక్షానికి మార్గాలు:

పురాణాల ప్రకారం, సముద్ర మధనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడానికి ముందే ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవి అవతరించింది. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తే దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం వద్ద రెండు దీపాలు వెలిగించడం, కర్పూరంలో రెండు లవంగాలు వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉంది. అలాగే, వంటగదిలోని ఉప్పు డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే నిండుగా ఉన్న ఉప్పు డబ్బా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. వ్యాపారస్తులు ఒక ఎర్రని వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పు, మూడు లవంగాలు కలిపి మూట కట్టి వ్యాపార స్థలంలో ఉంచడం ద్వారా దృష్టిదోషాలు తొలగి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని నమ్మకం.

విష్ణుమూర్తి, ఇతర దేవతల ఆరాధన:

నిజ జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజూ ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభప్రదం. అది సాధ్యం కాకపోతే, “ఓం త్రివిక్రమాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజూ సాయంత్రం తులసికోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక పూజలు, పండుగలు:

  • ఆంజనేయ స్వామి పూజ: ప్రతి మంగళవారం హనుమంతుని చిత్రపటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. హనుమాన్ ఆలయానికి వెళ్లి తమలపాకులు సమర్పించడం ద్వారా శని దోషాలు తొలగి అదృష్టం పెరుగుతుంది.
  • వెంకటేశ్వరస్వామి ఆరాధన: ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామిని పూజించి పిండి దీపాలు వెలిగిస్తే కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది.
  • నిర్జల ఏకాదశి: జూన్ 25వ తేదీన వచ్చే నిర్జల ఏకాదశి ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశి వ్రతాల ఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి.

ఆరోగ్యం, ఆయుష్షు కోసం:

వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆరోగ్యం, ఆయుష్షు, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముత్తైదువులు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

దానధర్మాలు సత్కార్యాలు:

ఈ మాసంలో దానం చేయడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, నీటి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పెద్దలను గౌరవించడం, భిక్ష అడిగిన వారిని ఖాళీ చేతులతో పంపకపోవడం, గోవులకు ఆహారం పెట్టడం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఉదయం ముగ్గులు వేయడం, దీపారాధన చేయడం, భగవన్నామ స్మరణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో భక్తిశ్రద్ధలతో ఈ నియమాలను పాటించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొంది, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం పొందాలని కోరుకుందాం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us