
శ్రీమద్ భగవద్గీత హిందూ గ్రంథాలలో అత్యంత స్ఫూర్తిదాయకమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. దీనిలో మానవుల జీవిత పయనానికి దారి చూపే మెరుగైన జీవితం కోసం అనేక మార్గాలు చూపించబడ్డాయి. ఇది మాత్రమే కాదు జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో మనకు బలాన్ని ఇస్తుంది . మనకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ పుస్తకంలో ఒక వ్యక్తి నైతిక, మానసిక , ఆధ్యాత్మిక క్షీణతకు గల కారణాలు ఏమిటి? వ్యక్తీ తను చేసిన కర్మల వల్ల విధ్వంసం వైపు ఎలా కదులుతాడో కూడా స్పష్టంగా వివరించబడింది. గీత ప్రకారం ఏ వ్యక్తి పతనానికి అయినా దారితీసే ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
భగవద్గీత 2వ అధ్యాయం 63వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా అంటాడు:
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
అంటే దీని అర్థం కోపం గందరగోళానికి దారితీస్తుంది, ఈ గందరగోళం జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం తెలివితేటలను నాశనం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి తెలివితేటలపై ఒకసారి ప్రభావం చూపిస్తే అతని పతనం ఖాయం. ఎందుకంటే కోపం ఒక వ్యక్తి మనస్సాక్షిని నాశనం చేస్తుంది. దాని కారణంగా అతను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించి చివరికి విధ్వంసం వైపు వెళ్తాడు.
మహాభారత యుద్ధంలో మమకారంలో చిక్కుకున్న అర్జునుడు తన కుటుంబాన్ని చంపే ఆలోచనను విరమించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు అతనికి మమకారంలో చిక్కుకోవద్దని సలహా ఇచ్చాడు. మానవ శరీరం మాత్రమే మరణిస్తుందని, ఆత్మ ఎప్పటికీ మరణించదని ఆయన అన్నారు. శ్రీ కృష్ణుడు ఇచ్చిన చెప్పిన గీత మనకు బోధిస్తుంది, ఒక వ్యక్తి అనుబంధం చట్రంలో చిక్కుకున్నప్పుడు.. అతను వాస్తవికత నుంచి దూరమవుతాడు. అది కుటుంబం పట్ల అనుబంధం అయినా, సంపద పట్ల అనుబంధం అయినా, గౌరవం పట్ల అనుబంధం అయినా. అతను తన మతం, విధి నుంచి తప్పుకుంటాడు. మనిషి స్వీయ-అభివృద్ధికి దూరంగా ఉండటానికి ఇదే కారణం.
అదుపులేని కోరికలకు దూరంగా ఉండటం మంచిది.
“మ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః అని చెప్పాడు
దీని అర్థం కోరిక , కోపం మనిషికి అతిపెద్ద శత్రువులు. కోరికలకు అంతం లేదు. ఈ కోరికలు నెరవేరనప్పుడు, కోపం పుడుతుంది. ఈ చక్రం నాశనానికి దారితీస్తుంది.
దురాశ అంటే అవసరానికి మించి ఏదైనా పొందాలనే కోరిక. అది మానవునిలోకి ప్రవేశిస్తే అతని నాశనం ఖాయం. ఇంద్రియ సుఖాల నుంచి కూడా దురాశ పుడుతుందని.. అది ఒక వ్యక్తిని నైతిక అధోగతి వైపు నడిపిస్తుందని గీతలో చెప్పబడింది. దురాశ కారణంగా ఒక వ్యక్తి అన్యాయమైన మార్గాల ద్వారా సంపద, పదవి లేదా ఆనందాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాడు..అది చివరికి అతని పతనానికి దారితీస్తుంది.
గీతలో మతాన్ని అనుసరించడం అత్యున్నతమైనదిగా చెప్పబడింది. ఒక వ్యక్తి తన సొంత మతాన్ని విడిచిపెట్టి, తన సొంత ప్రయోజనానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అతను అధర్మాన్ని సమర్ధిస్తున్నట్లు లెక్క. యుద్ధంలో పాల్గొనడం అర్జునుడి కర్తవ్యం అని, తన విధి నుంచి పారిపోవడం అతని పతనానికి దారితీస్తుందని శ్రీ కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు