
చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నాలుగు ధామ్లను సందర్శించడం ద్వారా మోక్షం లభిస్తుంది. చార్ ధామ్ యాత్ర మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా హిందూ మతంలోని ప్రతి వ్యక్తి చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటాడు. జీవితంలో ఒక్కసారైనా చార్ ధామ్ యాత్రను సందర్శించాలని కొందరు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు చార్ ధామ్ యాత్ర ఎందుకు అవసరమో, దాని ప్రాముఖ్యత ఏమిటి? సరైన పద్దతిలో ఈ యాత్ర ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం…
ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ ధామ్ తలుపులు మే 2న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ధామ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయి.
చార్ ధామ్ యాత్ర అంటే (యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్) నాలుగు పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు చేసే యాత్ర.. ఇది ఒక ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర. ఈ ప్రయాణంలో హిమాలయాలలో ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనను సూచిస్తుంది. ఈ యమునోత్రి నుంచి ప్రారంభమై, గంగోత్రి, కేదార్నాథ్ గుండా వెళ్లి బద్రీనాథ్తో ముగుస్తుంది.
సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో చార్ ధామ్ను సందర్శిస్తే.. అతను జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించిన తర్వాత నీటిని సేవించే భక్తుడు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. కనుక ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో చార్ ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటాడు.
చార్ ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రి ధామ్ సందర్శించాలి. యమునోత్రి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే, చార్ ధామ్ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో పూర్తి చేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.