Bhadrakali Temple: శాకాంబరీ ఉత్సవాలు అంటే ఏంటి..? ఆషాడంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!

| Edited By: Surya Kala

Jul 17, 2024 | 7:48 AM

ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే... ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.

Bhadrakali Temple: శాకాంబరీ ఉత్సవాలు అంటే ఏంటి..? ఆషాడంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!
Bhadrakali Temple
Follow us on

వరాలనిచ్చే చల్లనితల్లి.. ఆషాడంలో ఆరంభపూజలు అందుకునే శక్తిస్వరూపిని.. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు మహా వైభవంగా జరుగుతున్నాయి.. పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకాంబరీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.. కురగాయలతో పూజించే శాకంభరీ ఉత్సవాల విశిష్టతేంటీ..? శాకంభరీ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు..? కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనమేంటీ…? కాకతీయ వారసత్వ నగరం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకంభరీ ఉత్సావాల విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే… ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.

అంతేకాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడంవల్ల కరువుకాటకాలు దరిచేరవని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. .ఆ నమ్మకమే ప్రతియేటా ఈ ఉత్సవాల సమయంలో వేలాదిమంది భక్తులను భద్రకాళి దేవాలయం వైపు ధారపడేలా చేస్తుంది.. ఆషాడశుద్ద పాడ్యమినాడు ప్రారంభమయ్యే శాకంభరీ ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకంబరీ ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢవిశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నారు..

ఇవి కూడా చదవండి

ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించిన తరువాతే వివిధ రాష్ట్రాల్లోని దేవతామూర్తులు, దేశంలోని వేరువేరు ఆది పరాశక్తులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు..ఈ శాకంబరీ ఉత్సవాలకు కేవలం వరంగల్ జిల్లా నుండే కాకుండా వివిద జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా భక్తులు హాజరవుతారు.. విదేశాలలో స్థిరపడ్డ వరంగల్ వాసులు కూడా శాకంబరీ ఉత్సవాల సమయంలో ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరీగా దర్శనమిచ్చిన రోజున ఎలాంటి కోరికకోరుకున్నా..ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు..

ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకంబరీ ఉత్సవాలకు చాలా పెద్దచరిత్రే ఉంది. పూర్వం వందేళ్ల కరువు ఒకేసారి సంబవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట. అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా.. తన శరీరం నుండి ధన దాన్యాలు, కూరగాయలు, అన్న పానియాలు విడిచి ప్రజలు కష్టాలు తీర్చిందని చెపుతుంటారు.. కష్ట కాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టే అప్పటి నుండి అమ్మవారిని అన్నిరకాల కూరగాయలు,పండ్లు ఫలాలతో ఆరాదించి శాంతింపచేయాలని నిర్ణయించారు.. అప్పటినుండి ఈ శాకంబరీ ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడంవల్ల అతివృష్టి, అనావృష్టి ప్రజల దరిచేరవని ఆలయ అర్చకులంటున్నారు.

వందల యేళ్ళనుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ… 1979 నుండి అశేషంగా జరుగు తున్నాయి.. వరంగల్ లోని భద్రకాళి దేవాలయంలో శాఖంబరీ ఉత్సవాలు ప్రారంభమైన అనంతరం విజయవాడలోని కనకధర్గ అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు. పాడ్యమి రోజు ప్రారంబమైన శాకంబరీ ఉత్సవాలు, 21 తేదీన పౌర్ణమితో ముగిస్తాయి. పక్షంరోజులు 15 అవతారాలలో అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. అందులో కామేశ్వరి, కపాళినీ, కుల్లాక్రమం, భేరుండాక్రమం, విరోధినీక్రమం, వహ్నివాసినీ క్రమం, మహావజ్రేశ్వరీక్రమం, శివదూతిక్రమం, త్వరితాక్రమం, కులసుందరీక్రమం, నీలాక్రమం, నీలపతాకాక్రమం, విజయాక్రమం, సర్వంగళా క్రమం, జ్వాలామాలినీ క్రమం రూపాలలో అమ్మవారు దర్శనం ఇస్తారు..చివరిరోజు ఆషాడసుద్ద పౌర్ణమిరోజు సంపూర్ణ శాకంబరీగా అమ్మవారు దర్శనం ఇస్తారు .

భద్రకాళి ఆలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకంటే ఈ శాకాంబరీ ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంటుంది…కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు- అకుకూరలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు..ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ది ఉండడంవల్ల వీఐపీలు, ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని పరవశించిపోతుంటారు.. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను కనులార తిలకిస్తున్న ఓరుగల్లు ప్రజలు పులకరించి పోతున్నారు.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సృష్టిలో లభించే కూరగాయలతో ఆ దేవతామూర్తిని అలంకరించి ఆరిదించడమే ఈ ఉత్సవాల విశిష్టత.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..