AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజల దీవెనతోనే ఈ ఘన విజయం : విజయసాయిరెడ్డి

వైఎస్ జగన్ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. నవరత్నాల పథకంలో ప్రతి వర్గానికి లబ్ది చేకూరుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శాసన సభాపక్షనేతగా వైఎస్ జగన్ ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు. వైఎస్‌ జగన్‌ గారి పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పిస్తూ […]

ప్రజల దీవెనతోనే ఈ ఘన విజయం  : విజయసాయిరెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2019 | 3:02 PM

Share

వైఎస్ జగన్ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. నవరత్నాల పథకంలో ప్రతి వర్గానికి లబ్ది చేకూరుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శాసన సభాపక్షనేతగా వైఎస్ జగన్ ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.

ఇక కార్యకర్తలనుద్ధేశించి మరో ట్వీట్ చేశారు. ప్రజల దీవెనతో సాధించిన ఈ ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత పెరిగిందన్నారు. ఐదేళ్ల పాలనలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలని అన్నారు.