బిజెపికి బాబు బిస్కట్లు.. మరి అమిత్‌షా దిగొచ్చేనా?

బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారా? పరిస్థితులు, పరిణామాలు, టిడిపి నేతల సందర్శనలు చూస్తుంటే నిజమేనన్న అనుమానం కలుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా మారి.. మోదీపై ఆల్‌మోస్ట్ యుద్దాన్ని ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. తాజాగా బిజెపితో జతకట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యతో ఆయన బిజెపి పంచన మరోసారి చేరేందుకు సిద్దమవుతున్నారన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు మీడియాలో కథనాలొచ్చినా.. చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ […]

బిజెపికి బాబు బిస్కట్లు.. మరి అమిత్‌షా దిగొచ్చేనా?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2019 | 5:32 PM

బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారా? పరిస్థితులు, పరిణామాలు, టిడిపి నేతల సందర్శనలు చూస్తుంటే నిజమేనన్న అనుమానం కలుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా మారి.. మోదీపై ఆల్‌మోస్ట్ యుద్దాన్ని ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. తాజాగా బిజెపితో జతకట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యతో ఆయన బిజెపి పంచన మరోసారి చేరేందుకు సిద్దమవుతున్నారన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు మీడియాలో కథనాలొచ్చినా.. చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ ఖండించలేదు. పైగా బిజెపి నేతలు చంద్రబాబును తమ దరికి రానిచ్చేది లేదని ఖరాఖండీగా ప్రకటనలు చేశారు. రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు శాశ్వతంగా బిజెపి డోర్లు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు.

కానీ చంద్రబాబు ప్రయత్నాలు ఆపలేదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. అమరావతిని రాష్ట్ర రాజధాని కేంద్రంగా గుర్తించకపోవడం కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విడుదలైన మ్యాపుల్లోను అమరావతిని ఏపీ రాజధానిగా ప్రస్తావించలేదు. దీంతో వైఫల్యం గత టిడిపి పాలకులదా లేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యమా అన్న చర్చ జోరుగా సాగింది.

అయితే.. తాజాగా విడుదల చేసిన దేశ చిత్రపటంలో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించారు. దీనికి కృతఙ్ఞతలు చెప్పే సాకుతో టిడిపి నేతలు.. కమలం నేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల కోసం వున్న టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు కేంద్ర హోం శాఖా మంత్రి, బిజెపి అధినేత అమిత్‌షాను కలిసారు. బుధవారం అమిత్‌షాతో భేటీ అయిన టిడిపి నేతలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించామని మీడియాకు తెలిపారు. నిజానికి అమరావతిని గుర్తించినందుకు కలిస్తే రాజకీయ పరిణామాలపై చర్చించాల్సిన అవసరం అంతగా లేదు. అది కూడా ఆరు నెలల క్రితం తాము దుమ్మెత్తిపోసిన నేతతోనే రాజకీయ పరిణామాలను చర్చించడంలో ఔచిత్యం పెద్దగా వుండదు.

కానీ టిడిపి ఎంపీలు రాష్ట్ర రాజకీయ పరిణామాలను అమిత్‌షాతో చర్చించడం.. ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో చంద్రబాబు వ్యూహం కూడా గోచరిస్తుంది. చంద్రబాబు వ్యూహం ప్రకారమే తిరిగి బిజెపికి దగ్గరయ్యేందుకు స్కెచ్ వేశారని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు బిజెపి.. రెండింటి మధ్య టిడిపి కనుమరుగైతే పరిస్థితి దారుణంగా వుంటుందన్న ఫీలింగ్‌తోనే చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరలేపారని పరిశీలకులు భావిస్తున్నారు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..