AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు పార్టీలకు నెత్తినొప్పి.. ఇంతకీ వివేకాను చంపిందెవరు?

దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది. గత మార్చి నెల మూడో వారంలో కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు […]

మూడు పార్టీలకు నెత్తినొప్పి.. ఇంతకీ వివేకాను చంపిందెవరు?
Rajesh Sharma
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Dec 11, 2019 | 4:57 PM

Share

దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది.

గత మార్చి నెల మూడో వారంలో కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పినతండ్రి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన సొంతింట్లో దారుణ హత్యకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మర్డర్ జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో వున్న వైసీపీకి చెందిన నేత కావడంతో వివేకా హత్య కేసు అధికార పార్టీకి ఎక్కడ నష్టం కలిగిస్తుందో అని అప్పట్లో అధికారపార్టీ కంగారు పడింది.

హత్య జరిగిన రాత్రే ఆల్‌మోస్ట్ ఆధారాలన్నీ తుడిచేసిన పరిస్థితిలో కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఏ క్లూ దొరక్కపోవడంతో గత 9 నెలలుగా కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో అనుమానాలు వ్యక్తమయిన ప్రతీ ఒక్కరిని విచారణకు పిలుస్తోంది సిట్. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తులో పడుతున్న ఒక్కో అడుగు మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టిడిపి, బిజెపిలకు టెన్షన్ పుట్టిస్తోంది.

తొలుత ఈ కేసులో తెలుగుదేశంపార్టీలో వున్న బి.టెక్ రవిని అనుమానించారు. ఆయన్ని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన విచారణ పూర్తి అయిన వెంటనే కడప సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత, వైఎస్ వివేకా అన్న కొడుకు అయిన వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలిచింది సిట్. ఆ తర్వాత నజర్ మాజీ మంత్రి, ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డిపై పడింది. తాజాగా ఆయన్ను విచారణకు పిలిస్తే రావడం లేదన్న కథనాలు వినిపించాయి. దాంతో ఆయనపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి.

ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి.. వివేకా హత్యకేసులో తన ప్రమేయం వుందని నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దాంతో వివేకా హత్యకేసు మరో మలుపు తిరిగినట్లయ్యింది.

మొత్తమ్మీద ఎవరి ప్రమేయంతో వివేకా హత్య జరిగిందో కానీ.. ఎటు తిరిగి ఎవరికి చుట్టుకుంటుందో, తద్వారా తమ పార్టీ ఎక్కడ ఇరకాటంలో పడుతుందోనని టిడిపి, కాంగ్రెస్, బిజెపిల రాష్ట్ర నాయకత్వాలు మధనపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే