AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షర్మిలకు యామిని కౌంటర్

విజయవాడ: షర్మిల మాటలకు టీడీపీ నేత యామిని కౌంటరిచ్చారు. లోటస్ పాండ్‌లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఎలా తెలుస్తుంది? అమరావతి వచ్చి చూడాలి అంటూ మండిపడ్డారు.  రాష్ట్రంలో ప్రతి చెల్లెమ్మ, అక్కకు పసుపు కుంకుమ కింద చంద్రబాబు గారు ఇచ్చిన రూ. 20 వేల రూపాయలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌ల అర్హత గురించి మాట్లాడే హక్కు షర్మిలాకు లేదు అని యామిని అన్నారు. జగన్ అవినీతి సొమ్ములో షర్మిలాకు వాటా ఉంది. రోజా, […]

షర్మిలకు యామిని కౌంటర్
Vijay K
|

Updated on: Mar 25, 2019 | 6:48 PM

Share

విజయవాడ: షర్మిల మాటలకు టీడీపీ నేత యామిని కౌంటరిచ్చారు. లోటస్ పాండ్‌లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఎలా తెలుస్తుంది? అమరావతి వచ్చి చూడాలి అంటూ మండిపడ్డారు.  రాష్ట్రంలో ప్రతి చెల్లెమ్మ, అక్కకు పసుపు కుంకుమ కింద చంద్రబాబు గారు ఇచ్చిన రూ. 20 వేల రూపాయలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌ల అర్హత గురించి మాట్లాడే హక్కు షర్మిలాకు లేదు అని యామిని అన్నారు.

జగన్ అవినీతి సొమ్ములో షర్మిలాకు వాటా ఉంది. రోజా, షర్మిలాకు తేడా లేదు. వీరిద్దరి మాటలను ఎవరూ పట్టించుకోరు. రోజా మాటలనే షర్మిలా చెప్పారంటూ యామిని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదాను మోడీ, కేసీఆర్‌లకు జగన్ అమ్మేశారని, అలా ఎందుకు చేశారో ఆయన్ను షర్మిలా ఎందుకు ప్రశ్నించలేదని యామిని ప్రశ్నించారు.

కేటీఆర్‌కు ఐటీ శాఖ కేటాయించడం చూసి, ఇక్కడ లోకేశ్‌కు కూడా ఐటీ శాఖ కేటాయించారని, అయినా లోకేశ్ చేసిందేమీ లేదని లోకేశ్‌పై షర్మిలా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాని చోరీ చేసి తనకు కావాల్సిన కంపెనీలకు లోకేశ్ ఇచ్చుకున్నారంటూ షర్మిల అంతకుముందు మండిపడ్డారు.

Follow Us