ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికారులు అప్రమత్తమయ్యారు. అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మరికొన్ని గంటల్లోనే ఎలక్షన్ ఫలితాలు వెలువడే అవకాశమున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. ముందే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్తో ‘జగనే సీఎం’ అంటూ ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.