AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపరాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బ‌ృంద సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంట్‌కు 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు. భారతదేశంలో మహిళలు సాధికరత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు […]

ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2019 | 5:35 PM

Share

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపరాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బ‌ృంద సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంట్‌కు 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు. భారతదేశంలో మహిళలు సాధికరత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారన్నారు నవీన్ పట్నాయక్. ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనా దేశాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా మహిళా సాధికారతే మార్గమన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యాలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడాలన్నారు. కాగా మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబరులో ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదింప చేశారు. దీనికి బీజేపీ, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి.