‘ఇప్పుడు బెంగాల్ ఠీవిగా నిలబడింది’, ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయంపై మమతా బెనర్జీ వ్యాఖ్య

బెంగాల్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నాశనం బారి కాకుండా రక్షించారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడీ స్టేట్ ఠీవిగా, నిటారుగా నిలబడింది అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ (బీజేపీ)

'ఇప్పుడు బెంగాల్ ఠీవిగా నిలబడింది',  ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయంపై  మమతా బెనర్జీ వ్యాఖ్య
Mamata Banerjee
Follow us

| Edited By: Phani CH

Updated on: May 03, 2021 | 6:21 PM

బెంగాల్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నాశనం బారి కాకుండా రక్షించారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇప్పుడీ స్టేట్ ఠీవిగా, నిటారుగా నిలబడింది అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రంలో పాలన సాగిస్తున్న పార్టీ (బీజేపీ) ‘షెహన్ షా’  ఏమీ కాదని,  దాన్ని బెంగాల్ ప్రజలు ఎక్కడ ఉంచాలో, అక్కడే ఉంచారని ఆమె చెప్పారు. నాశనం నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజలు రక్షించారు..బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారు అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో బెంగాల్ ఇండియాను కాపాడిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని మమత అన్నారు. తాము 200 కి పైగా సీట్లను గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికిందని, కానీ ఆ పార్టీ అహంకారాన్ని ప్రజలు తుడిచిపెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.  కమలం పార్టీ ఇగో ఇప్పుడు ఎక్కడికి పోయిందన్నారు. బీజేపీ ఇచ్చే డబ్బులు తీసుకోండి..కానీ ఓటు ఎవరికి  వేయాలన్నది మీరే నిర్ణయించుకోండి అని ఆమె తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పదేపదే ఓటర్లను కోరుతూ వచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి గుణపాఠం కావాలన్నారు.  ఈ ఫలితాల పట్ల ఆ పార్టీ నేతలు ఖంగు తిన్నారని ఆమె పేర్కొన్నారు.

కాగా ఈ ఫలితాలను బీజేపీ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బెంగాల్ లో మళ్ళీ దీదీదే పై చేయి అని,  బీజేపీ రెండో స్థానంలో వస్తుందని ప్రకటించాయి. అయితే వీటిని నమ్మజాలమని, మే 2 వరకు వేచి చూద్దామని ఈ పార్టీ నేతలు అమిత్ మాలవీయ వంటివారు ట్వీట్స్ చేస్తూ వచ్చారు.  అయితే మునుపటితో పోలిస్తే ఇప్పుడు తమ బలం కాస్త పెరిగిందని  పార్టీ నేతలు సంతృప్తి పడుతున్నారు. కానీ ఈ పార్టీ ఎంపీ బాబుల్  సుప్రియో తన ఫేస్ బుక్ లో టీఎంసీ విజయం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.  బెంగాల్ ఓటర్లు చరిత్రాత్మక తప్పిదం చేశారని ఆయన మండిపడ్డారు. తానుమమతా  బెనర్జీని అభినందించబోనని , అలాగే ఈ ప్రజల తీర్పును శిరసావహించబోనని ఆయన అన్నారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని పేర్కొన్నారు. ఇది అవినీతికరమైన,అసమర్థ ప్రభుత్వమని, ఈ క్రూర మహిళకు (మమత)ప్రజలు మళ్ళీ అధికారం అప్పగించారని దుయ్యబట్టారు.  కానీ ఈ పోస్టును ఆయన తరువాత తొలగించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal CM 2021: వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీ.. 5న ముహూర్తం..

TDP in Tirupati: పార్టీని మరోసారి తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు.. వరుస పరాజయాలతో చతికిలాపడ్డ తెలుగుదేశం

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హరర్ మూవీ..ఎక్కడ చూడొచ్చంటే?
బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే
బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే
ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతర.. అందుబాటు ధరలో.. టాప్ బ్రాండ్లు..
ఈ నెలలో స్మార్ట్ ఫోన్ల జాతర.. అందుబాటు ధరలో.. టాప్ బ్రాండ్లు..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..