నిజామాబాద్లో భారీ ఈవీఎంలతో ఎన్నికలు!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో పోలింగ్ నిర్వహణపై సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తమ సమస్యలను జాతీయస్థాయిలో ప్రతిబింబించడానికి పసుపు, ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతో సహా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో పోలింగ్ నిర్వహణపై సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తమ సమస్యలను జాతీయస్థాయిలో ప్రతిబింబించడానికి పసుపు, ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతో సహా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్ ఉపయోగించాలా? ఈవీఎంల ద్వారా పోలింగ్ సాధ్యమేనా అన్న విషయంపై ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేసింది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అనే కోణంలోనూ చర్చించారు. చివరికి ఎం-3 రకం ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించారు.
భెల్(BHEL) తయారు చేసిన ఈ ఎం-3 రకం ఈవీఎంలలో 383 మంది వరకు పోటీలో ఉన్నా పోలింగ్ సాధ్యమవుతుంది. ఇవి ఈసీ దగ్గర ఉన్నా ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించారు. మరోవైపు, ఈసీఐఎల్(ECIL) కూడా ఎం-3 యూనిట్లను తయారు చేస్తోంది. దీంతో ఆ యూనిట్లను సరఫరా చేయాల్సిందిగా ఆ సంస్థను ఎన్నికల సంఘం కోరింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 26,820 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లను వినియోగించనున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ వెల్లడించారు.