బాబును మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే: విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని విమర్శించారు. తిరుపతికి జెరూసలేం యాత్రపై గత రెండు రోజులుగా ఏపీలో చర్చ నడుస్తోంది. వైసీపీ అన్యమత ప్రచారానికి మద్దతిస్తున్నారని.. టీడీపీ నేతలతో పాటు, పలువురు విమర్శిస్తున్నారు. అయితే.. ఈవిషయంపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. మూడు నెలలకే ఇంత బట్టలు చించుకుంటే […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అని విమర్శించారు. తిరుపతికి జెరూసలేం యాత్రపై గత రెండు రోజులుగా ఏపీలో చర్చ నడుస్తోంది. వైసీపీ అన్యమత ప్రచారానికి మద్దతిస్తున్నారని.. టీడీపీ నేతలతో పాటు, పలువురు విమర్శిస్తున్నారు. అయితే.. ఈవిషయంపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.
మూడు నెలలకే ఇంత బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూ? తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేశాలు రెచ్చగొడుతున్నారు. మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 24, 2019