AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azharuddin: టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: అజహరుద్దీన్

తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తానని శపథం చేశారు కొత్త టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్

Azharuddin: టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: అజహరుద్దీన్
Mohammad Azharuddin
Venkata Narayana
|

Updated on: Sep 13, 2021 | 5:38 PM

Share

Mohammad Azharuddin: తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తానని శపథం చేశారు టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్. కామారెడ్డి జిల్లా పర్యటనలో అజార్ ఇంతకుముందెన్నడూ లేని రీతిన రాజకీయాలపై స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అబివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత తెరాస ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయి పాలనా కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.” అంటూ అజార్ పిలుపునిచ్చారు.

“125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే తర్వాత మ్యాచ్ లో గెలుస్తాం. కాని ఎన్నికలలో ఓడిపొతే 5 సంవత్సరాల వరకు ఎన్నికలు ఉండవు. దీంతో రాష్ట్రాభివృద్ది కుంటుపడిపోతుంది. నేను ఇండియా క్రికెట టీం కు కెప్టెన్ గా పనిచేసి ఎన్నో విజయాలు సాధించా. అదేవిధంగా టీపీసీసీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తా.” అని అజార్ శపథం చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని నిన్న ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కొనసాగుతారు. కన్వీనర్‌గా షబ్బీర్ అలీ, సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుక చౌదరి, బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఇక, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ ఆమోదించిన కమిటీల ఛైర్మన్లు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జిలు కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉన్నారు.

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం