తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్‌.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ​మంత్రి కేటీఆర్

తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 12 కొత్త జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా..

తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్‌.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన ​మంత్రి కేటీఆర్
Ktr Vote In Mlc Polling
Follow us

|

Updated on: Mar 14, 2021 | 9:08 AM

తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 12 కొత్త జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ – ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కలిపి 1,530 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ను దినపత్రిక సైజులో ముద్రించారు. వీటికి అనుగుణంగా జంబో బ్యాలెట్‌ బాక్సులను రూపొందించారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 5,31,268 మంది, వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రెండు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15వేల మందికిపైగా సిబ్బందిని మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఐటీ, పురపాలక శాక మంత్రి కేటీఆర్‌, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నెం కవిత షేక్ పేట్ తహసీల్దార్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ ఓటేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలన్నారు. విద్యావంతులు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read More:

పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి

ఏపీలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మరికొద్దిసేపట్లో తొలి ఫలితం.. తీవ్ర ఉత్కంఠలో అభ్యర్థులు

Latest Articles
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి