సంపదలో కొండానే టాప్!

హైదరాబాద్‌ : ఇరు  తెలుగు రాష్ట్రాల్లో సంపన్న రాజకీయ నాయకుడిగా  కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 895 కోట్లుగా పేర్కొన్నారు.  గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల బరిలో దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి…తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన […]

సంపదలో కొండానే టాప్!
Follow us

|

Updated on: Mar 23, 2019 | 6:08 PM

హైదరాబాద్‌ : ఇరు  తెలుగు రాష్ట్రాల్లో సంపన్న రాజకీయ నాయకుడిగా  కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 895 కోట్లుగా పేర్కొన్నారు.  గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల బరిలో దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి…తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

తన చరాస్తుల విలువ 223 కోట్లుగా పేర్కొన్న విశ్వేశ్వర్‌ రెడ్డి.. తన భార్య, అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి చరాస్తుల విలువ 613 కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక తన కుమారుడి చరాస్తుల విలువ రూ. 20 కోట్లని పేర్కొన్నారు. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 36 కోట్లుగా పేర్కొన్న ఆయన.. భార్య స్థిరాస్తుల విలువ కేవలం రూ. 1.81 కోట్లని తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 528 కోట్లని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.