AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ ప్లేస్‌లో ఎన్టీఆర్..ఆ పని చేసిందెవరు..?

గవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. అగవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ధికారంలో ఉన్న పార్టీ తమను రిప్రజెంట్ చేసేలా గవర్నమెంట్ ఆఫీస్‌‌లకు రంగులు వేయడం, ప్రభుత్వ పథకాల నేమ్స్‌ను రిప్లేస్ చెయ్యడం పరిపాటి. తాజాగా ఏపీలో గ్రామ సచివాలయాలకు..వైసీపీ […]

జగన్ ప్లేస్‌లో ఎన్టీఆర్..ఆ పని చేసిందెవరు..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 3:41 PM

Share

గవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. అగవర్నమెంట్ మారితే..ప్రభుత్వ భవనాల దగ్గర్నుంచి, బస్సులకు..ఆఖరికి రోడ్ డివైడర్స్‌కి వేసే రంగుల వరకు అన్నీ మారుతూనే ఉంటాయ్. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ధికారంలో ఉన్న పార్టీ తమను రిప్రజెంట్ చేసేలా గవర్నమెంట్ ఆఫీస్‌‌లకు రంగులు వేయడం, ప్రభుత్వ పథకాల నేమ్స్‌ను రిప్లేస్ చెయ్యడం పరిపాటి. తాజాగా ఏపీలో గ్రామ సచివాలయాలకు..వైసీపీ జెండా రంగు వేస్తున్నారని విమర్శలు వచ్చాయి.

అయితే వీటిపై అధికార వైసీపీ డిపెండ్ చేసుకుంటుంది.  గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పసుపు రంగు వేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ రంగులు వేశారు. అయితే,  గ్రామానికి చెందిన కొందరు  టీడీపీ కార్యకర్తలు తిరిగి ఆ భవనానికి పసుపు రంగు వేసే ప్రయత్నం చేశారు. అదీకాక, భవనంపై ఉన్న సీఎం జగన్ ఫోటో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను అతికించారు. దీంతో ఆ ఘటన రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో 17మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.