AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కడప: ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. ఆయన్ను ఎవరు హత్య చేసి ఉంటారన్న విషయం అంతుచిక్కని విషయమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ మీద వైసీపీ, వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఆరోపణల్లో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి మొదటిగా చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తొలిగా విషయాన్ని ఎవరు చెప్పారు? ఆ తర్వాత ఆయన దాన్ని ఎవరికి తెలిపారు? ఉదయం లేని లెటర్ సాయంత్రం ఎలా […]

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijay K
|

Updated on: Mar 16, 2019 | 5:42 PM

Share

కడప: ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. ఆయన్ను ఎవరు హత్య చేసి ఉంటారన్న విషయం అంతుచిక్కని విషయమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ మీద వైసీపీ, వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఆరోపణల్లో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి మొదటిగా చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తొలిగా విషయాన్ని ఎవరు చెప్పారు? ఆ తర్వాత ఆయన దాన్ని ఎవరికి తెలిపారు? ఉదయం లేని లెటర్ సాయంత్రం ఎలా బయటకొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. వివేకాతో అవినాశ్ రెడ్డికి విభేదాలు కూడా ఉండటంతో అవినాశ్‌పై పలు ఆరోపణలను టీడపీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి స్వయంగా స్పందించారు.

తాను వెళ్లిన సమయంలో వివేకానంద రెడ్డి బాత్‌‌రూంలో పడి ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి లెటర్ లేదని వివరించారు. తాను ఉదయం 6:43కి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అరగంట తర్వాత పోలీసులు వచ్చాు. పోలీసులు వచ్చేంత వరకూ కుటుంబ సభ్యులమంతా బయటే ఉన్నాము.

వివేకా గారి బాడీని పోలీసులే స్వాధీనం చేసుకుని, ఆస్పత్రికి తీసుకెళ్లారని అవినాశ్ రెడ్డి చెప్పారు. వివేకా గారి కూతురు, సతీమణి, అల్లుడు హైదరాబాద్‌లో ఉన్నారని వారు వచ్చే వరకు పోస్ట్‌మార్టం స్టార్ట్ చేయొద్దని చెప్పాము. పదిన్నర్ర, పదకొండు సమయంలో మీడియాతో మాట్లాడుతూ హత్య అని చెప్పాము. తమకు పూర్తిగా తెలియదు కాబట్టే అనుమానాస్పద మృతిగా మొదట అన్నట్టు అవినాశ్ అన్నారు. బాధితులపైనే ప్రభుత్వం విమర్శలు చేస్తూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

వివేకా కుమార్తె, కొంతమంది డాక్టర్లు వచ్చిచూసిన తర్వాత హత్య అని నిర్ధారించుకున్నామని అవినాష్‌రెడ్డి చెప్పారు.