AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీ మారితే నాపై క్రిమినల్ కేసు పెట్టండి

పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పిన పొన్నం.. దానికి సంబంధించి ఒక అఫిడవిట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరారని.. నిన్ను గెలిపించినా ఇదే పని చేస్తావా..?’’ అని కొన్ని చోట్ల […]

పార్టీ మారితే నాపై క్రిమినల్ కేసు పెట్టండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 9:01 AM

Share

పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పిన పొన్నం.. దానికి సంబంధించి ఒక అఫిడవిట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరారని.. నిన్ను గెలిపించినా ఇదే పని చేస్తావా..?’’ అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నించారని, అందుకే తాను ఈ పని చేసినట్లు తెలిపారు.

తన అఫిడవిట్ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల్లో బీజేపీపై విమర్శలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్‌లు ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీతో జతకట్టమని అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ గెలిస్తే మంత్రి అవుతారని అంటోన్న కేటీఆర్.. ఏ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రి అవుతారో చెప్పాలని కోరారు.