AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురికి కాల్వలో మానవత్వం: మంచు విష్ణు

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు స్పందించారు. వివేకానందరెడ్డి అంకుల్ హత్యపై కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతుందా అన్న భావన కలుగుతోందని అన్నారు. ఈ దారుణమైన ఘటనను ఖండించడం మానేసి రాజకీయం చేయడం, బురద జల్లడం చూస్తుంటే వాళ్లకు అసలు బుర్ర ఉందా అని అనిపిస్తోందని సోసల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. Humanity seems to be going […]

మురికి కాల్వలో మానవత్వం: మంచు విష్ణు
Vijay K
|

Updated on: Mar 16, 2019 | 8:54 PM

Share

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు స్పందించారు. వివేకానందరెడ్డి అంకుల్ హత్యపై కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతుందా అన్న భావన కలుగుతోందని అన్నారు. ఈ దారుణమైన ఘటనను ఖండించడం మానేసి రాజకీయం చేయడం, బురద జల్లడం చూస్తుంటే వాళ్లకు అసలు బుర్ర ఉందా అని అనిపిస్తోందని సోసల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు.

దివంగత వైఎస్పార్ సోదరుడి కుమార్తె విరనికాను మంచు విష్ణు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విరనిక ఈ సంఘటనపై స్పందిస్తూ సిట్ విచారణ గానీ, బీసీఐ విచారణ ద్వారా గానీ న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదని చెప్పింది. దేవుడు అంతా చూస్తున్నాడని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఆయన చేతుల నుండి తప్పించుకోలేరని పోస్ట్ చేసింది. మా పెద్దనాన్న చాలా మంచి మనిషి అంటూ తన సోషల్ మీడియాలో విరనికా పోస్ట్ పెట్టింది.