AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాభసాటి వ్యవసాయంపై కేంద్రం ఫోకస్.. పాడి-కోళ్ల పెంపకం, కొబ్బరి, గంధపు సాగుకు ప్రాధాన్యత..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 వ్యవసాయ బడ్జెట్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రభుత్వ లక్ష్యం ధాన్యం ఉత్పత్తికే పరిమితం కాదని, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. పాడి, కోళ్ల పెంపకం, ఉద్యానవన, ప్రత్యేక పంటల ద్వారా రైతులకు ఆదాయ అవకాశాలను పెంచుతామని కేంద్ర మంత్రి నిర్మలా పేర్కొన్నారు.

లాభసాటి వ్యవసాయంపై కేంద్రం ఫోకస్.. పాడి-కోళ్ల పెంపకం, కొబ్బరి, గంధపు సాగుకు ప్రాధాన్యత..!
Agriculture Budget, Nirmala Sitharaman
Balaraju Goud
|

Updated on: Feb 01, 2026 | 4:58 PM

Share

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 వ్యవసాయ బడ్జెట్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రభుత్వ లక్ష్యం ధాన్యం ఉత్పత్తికే పరిమితం కాదని, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. పాడి, కోళ్ల పెంపకం, ఉద్యానవన, ప్రత్యేక పంటల ద్వారా రైతులకు ఆదాయ అవకాశాలను పెంచుతామని కేంద్ర మంత్రి నిర్మలా పేర్కొన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులను వైవిధ్యపరచడం వల్ల రైతుల ఆదాయాలు పెరగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఇందుకు అనుగుణంగా, బడ్జెట్ 2026 సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, కొత్త ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

పాడి – కోళ్ల పెంపకంపై ప్రధాన దృష్టి

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, పాడి – కోళ్ల పెంపకాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులు, చిన్న కుటుంబాలకు ఈ రంగాలు లాభసాటిగా ఉంటాయన్నారు. రైతులు పాలు, గుడ్లు సంబంధిత ఉత్పత్తుల నుండి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీనిని సాధించడానికి, మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, మార్కెట్ ప్రాప్యతను పెంచాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

భారతదేశం ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలో దాదాపు 30 మిలియన్ల మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా కొబ్బరి సాగు సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో, కొబ్బరి రంగానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. కొబ్బరి ఉత్పత్తి చేసే కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వం కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. ఇది కొబ్బరి రైతులకు మెరుగైన మద్దతును అందిస్తుంది. కొబ్బరి సంబంధిత ఉత్పత్తుల నాణ్యత, అమ్మకాలు రెండింటినీ మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనె, ఫైబర్ వంటి ఇతర ఉత్పత్తులతో సహా కొబ్బరి విలువ పెంచి ప్రోత్సహిస్తుందని ఆమె వెల్లడించారు.

జీడిపప్పు – కోకో కొత్త గుర్తింపు

2026 వ్యవసాయ బడ్జెట్‌లో జీడిపప్పు – కోకోకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ఎగుమతులను పెంచడంపై కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జీడిపప్పు, కోకో సంబంధిత ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవడానికి రైతులు, వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గంధపు సాగును తిరిగి ఉత్తేజపరుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2026 వ్యవసాయ బడ్జెట్‌లో ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బాదం, వేరుశెనగ వంటి పంటలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..