బీజేపీలో చేరిన గద్దె బాబూరావు

| Edited By:

Oct 31, 2020 | 4:19 PM

ఇటీవలే టీడీపీకి గుడ్‌బై చెప్పిన గద్దె బాబూరావు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ సమక్షంలో ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు

బీజేపీలో చేరిన గద్దె బాబూరావు
Follow us on

Gadde Babu Rao: గత నెలలో టీడీపీకి గుడ్‌బై చెప్పిన గద్దె బాబూరావు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ సమక్షంలో ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారని, గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పొత్తును వదులుకున్నటు చంద్రబాబు తెలిపారని సోము వీర్రాజు విమర్శించారు. ( సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)

రాష్ట్రంలో చంద్రబాబు నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారని దుయ్యారబట్టారు. హుద్ హూద్ సమయంలో అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువుల పూడికలో అడ్డగోలుగా దోచేశారని విమర్శించారు. బాత్రూమ్‌ కట్టడంలో కూడా టీడీపీ నాయకులు అవకతవకలకు పాల్పడి నిధులు జేబుల్లోకే వెళ్లాయని ఆరోపించారు. చంద్రబాబు సొంత మండలంలో కూడా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులను దోచేశారని సోమువీర్రాజు విమర్శించారు. (‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో పాట పాడనున్న అలియా..!)