సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ దర్శకనిర్మాత దినేష్ గాంధీ(52) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన దినేష్
Dinesh Gandhi passes away: ప్రముఖ దర్శకనిర్మాత దినేష్ గాంధీ(52) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన దినేష్.. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (‘ఆర్ఆర్ఆర్’లో పాట పాడనున్న అలియా..!)
అయితే దాదాపు పది సంవత్సరాలుగా శాండిల్వుడ్లో ఆయన సేవలు అందించారు. 2009లో సుదీప్ కిచ్చా హీరోగా దినేష్ తెరకెక్కించిన ‘వీర మదకారి’ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది. అలాగే సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చత్రపతి మూవీకి దినేష్ దర్శకత్వం వహించారు. ఇక కొన్ని నెలల క్రితం తన కుమారుడితో కలిసి ఓ మూవీని చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. కానీ కరోనా రావడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వగా.. ఇవాళ ఆయన మరణించారు. కాగా దినేష్ అంత్యక్రియలు ఇవాళ బెంగళూరులో జరగనున్నాయి. ( హైదరాబాద్కి రానున్న ‘రాధే శ్యామ్’ టీమ్..!