కె.ఎ.పాల్కు ఈసీ షాక్.. రద్దు దిశగా పార్టీ గుర్తు
మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్ ప్రపంచంలో ఎక్కడైనా […]
మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్ ప్రపంచంలో ఎక్కడైనా హెలికాప్టర్, ఫ్యాన్ ఒకేలా ఉండడం చూశామా? ఇందులో వైసీపీ దురుద్దేశం ఉందని ఆరోపించారు. రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని ఈసీకి సమాధానమిచ్చారు. పాల్ స్పందనను పెద్దగా పట్టించుకోని ఈసీ.. ఆయన గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలానే గుర్తుల గొడవ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో పొలి ఉన్న ట్రక్కు గుర్తును పలువురు ఇండిపెండెంట్లకు కేటాయించారు. అయితే వీరందరికీ అంచనాలకు మించి ఓట్లుపడ్డాయి. కారు, ట్రక్కూ రెండూ ఒకేలా ఉండటంతో ప్రజలు పొరపాటున ట్రక్కుకు వేశారని టీఆర్ఎస్ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు. తమకు పడాల్సిన ఓట్లు కారు గుర్తుకు పడ్డాయనీ, కారణం ట్రక్కు, కారు గుర్తులు ఒకేలా ఉండటమేనని అన్నారు. ఈ రెండు వాదనలూ విన్న ఎన్నికల సంఘం… ప్రస్తుతానికి ట్రక్కు గుర్తును పక్కన పెట్టింది. ఇకపై ఎక్కడ ఎన్నికలు జరిగినా… గుర్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈసీ… హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐతే పాల్ మాత్రం హెలికాఫ్టర్ గుర్తు తొలగించకుండా ఉండాలని కోరుకుంటున్నారు.