AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Ravishanker: పండుగ పూట, రెండు గంటలు మండుటెండలో నిల్చున్న చొప్పదండి ఎమ్మెల్యే.. ఇంతకీ జరిగిందంటే..?

ఉగాది పండుగ పూట అందరూ ఇంట్లో ఉండి కుటుంబసభ్యులతో సంతోషంగా సంబురంలో మునిగి తేలుతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పండుగను పక్కకు పెట్టి రోడ్లపైకి వచ్చారు.

MLA Ravishanker: పండుగ పూట, రెండు గంటలు మండుటెండలో నిల్చున్న చొప్పదండి ఎమ్మెల్యే.. ఇంతకీ జరిగిందంటే..?
Choppadandi Mla Ravishanker Distribute Free Masks
Balaraju Goud
|

Updated on: Apr 13, 2021 | 4:27 PM

Share

Choppadandi MLA Ravishanker: ఉగాది పండుగ పూట అందరూ ఇంట్లో ఉండి కుటుంబసభ్యులతో సంతోషంగా సంబురంలో మునిగి తేలుతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పండుగను పక్కకు పెట్టి రోడ్లపైకి వచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోండంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మాస్కులు అందజేసి.. కరోనా బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడుకోండి కోరుతున్నారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉగాది పండుగ రోజున మాస్కులు లేకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గమనించారు. కరోనా సెకండ్‌వెవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇంట్లోంచి రోడ్డు మీదికొచ్చారు. మండుటెండల్లో రెండుగంటలపాటు నిలబడి మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి మాస్కులు అందించి, వారికి మాస్కు పై అవగాహన కల్పించారు.

మాస్క్ ధరించకుండా బయటకు రావొద్దన్నారు ఎమ్మెల్యే రవిశంకర్ జనానికి హితవు పలికారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. అయితే రెండు గంటలపాటు మండుటెండలో నిల్చొని ప్రజల కొరకు మాస్కులు అందించిన ఎమ్మెల్యేను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండుగ రోజున ప్రజారోగ్యంపై ఇంత శ్రద్ధ వహిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలిన రవిశంకర్ పిలుపునిచ్చారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సెకండ్ వేవ్ ప్రభావంగా చాలా ఉంది. దీంతో కేసుల తీవ్రత పెరుగుతుండటంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జనంలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ కట్టడికి ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే రవిశంకర్ చెబుతున్నారు.

Read Also..  Viral News: పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..