సీబీఐ నోటుసులపై స్పదించిన ఆమంచి.. వారిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న చీరాల మాజీ ఎమ్మెల్యే

న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు... విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును..

సీబీఐ నోటుసులపై స్పదించిన ఆమంచి.. వారిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న చీరాల మాజీ ఎమ్మెల్యే
Follow us

|

Updated on: Feb 12, 2021 | 9:31 AM

న్యాయ స్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు… విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ బహిరంగ సభలో తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశానన్నారు… ఒక పౌరుడిగా తన అభిప్రాయాలు తెలియచేశానేకానీ, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించలేదన్నారు… తాను సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టలేదని, వ్యాఖ్యానాలు చేయలేదన్నారు… చీరాలలో వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జరిగిన సభలో హైకోర్టు తీర్పుపై తన అభిప్రాయం తెలియచేశానన్నారు. ఇదే విషయాన్ని ఈనెల 12 విశాఖ సిబిఐ కోర్టుకు హాజరై చెబుతానన్నారు…

మరోవైపు ఈ కేసులో ఈనెల ఫిబ్రవరి 6వ తేదీన విచారణ కోసం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ విశాఖపట్నం డిఎస్పి వి.శ్రీనివాసరావు గతంలో ఆమంచికి నోటీసులు పంపించారు… అయితే ఎన్నికల నేపద్యంలో మరోసారి హాజరుకాగలనని సిబిఐకి ఆమంచి తెలియచేయడంతో ఈనెల 12న హాజరుకావాలని తిరిగి ఆమంచికి సిబిఐ కార్యాలయం నుంచి నోటీసు ఇచ్చారు… దీంతో రేపు ఆమంచి విశాఖ సిబిఐ కోర్టులో హాజరై తన వివరణను ఇవ్వనున్నారు…

విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసుని హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆమంచితో సహా రాష్ట్రంలోని వైసీపీ నేతలు పలువురు కోర్టు తీర్పుని విమర్శించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు కనీస రక్షణ సామగ్రి లేదని డాక్టర్ సుధాకర్ బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌ ను పోలీసులు నిర్బంధించడం, మానసికస్థితి సరిగ్గా లేదంటూ మెంటల్ హాస్పిటల్ కు తరలించటం వంటి పరిణామాలు చోటు చేసుకోగా హైకోర్టు వరకు విషయం వెళ్లింది. ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

ఈ తీర్పుపై వైసిపి నేతలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ , చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు విమర్శలు చేశారు. గత ఏడాది జులై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమంచి కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా వ్యాఖ్యలు చేసిన మొత్తం 98 మంది వైసిపి నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టుకి, ఆ తీర్పునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు వీరందరి మీదా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో 2020 నవంబర్‌ 11వ తేదిన విశాఖలో సిబిఐ అధికారులు వైసిపి నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు… విచారణ చేపట్టిన సీబీఐ అందుబాటులో ఉన్నవారికి నోటీసులు పంపింది… దీనిలో భాగంగానే ఆమంచికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు ఆమంచి విశాఖలోని సిబిఐ అధికారుల ఎదుట హాజరై తన వివరణను ఇవ్వనున్నారు.

Read more:

తెలంగాణ ఉద్యోగులకు షాక్.. పీఆర్సీ అమలుకు అడ్డంకిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌..

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..